Chandrababu: ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం ఆడుతున్నారు.. నేను సవాలు చేస్తున్నా ఎలా పేదవాడు అవుతావు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjuna Kharge: మోడీ వల్లనే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
టీడీపీకి కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. నా మనసుకు దగ్గరున్న జిల్లా శ్రీకాకుళం అని చంద్రబాబు అన్నారు. రా కదలిరా సభలో మాట్లాడుతూ.. అరాచక ప్రభుత్వం ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలనలో అందరూ బాధ్యులే.. తాను కూడా భాదితుడినేనని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ ను మనం తయారుచేసాం.. దానిని ఎవరూ విధ్వంసం చేయలేదని అన్నారు. ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 2029 విజన్తో అమరావతి, పొలవరం ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. అయితే.. 2024లో టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ కంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తుఫాన్ లా వచ్చిందని దుయ్యబట్టారు.
Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు.. విచారణ 3 వారాలు వాయిదా
బష్మాసురిడిలా మీ నెత్తిన చేయిపెట్టాడు.. కలియుగ బష్మాసురిడ్ని అంతం చేయటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్.. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క.. బస్సులు కూడా సరిగా లేవు.. రూ.20 కోట్లతో జగన్ బుల్లెట్ ప్రూప్ బస్సులు తెప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనం వృధా చేస్తున్నాడు.. పేదలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తం త్రాగే వ్యక్తి పేదవాడు అవుతాడా.? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్.. నేడు ఎంత..? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు. జగన్ నాటకాల ముందు సురభినాటకాలు కూడా పనిచేయవని విమర్శించారు. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేసారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వానికి మీరు సిద్దమా..? అని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!