Chandrababu: ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం ఆడుతున్నారు.. నేను సవాలు చేస్తున్నా ఎలా పేదవాడు అవుతావు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjuna Kharge: మోడీ వల్లనే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
టీడీపీకి కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. నా మనసుకు దగ్గరున్న జిల్లా శ్రీకాకుళం అని చంద్రబాబు అన్నారు. రా కదలిరా సభలో మాట్లాడుతూ.. అరాచక ప్రభుత్వం ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలనలో అందరూ బాధ్యులే.. తాను కూడా భాదితుడినేనని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ ను మనం తయారుచేసాం.. దానిని ఎవరూ విధ్వంసం చేయలేదని అన్నారు. ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 2029 విజన్తో అమరావతి, పొలవరం ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. అయితే.. 2024లో టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ కంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తుఫాన్ లా వచ్చిందని దుయ్యబట్టారు.
Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు.. విచారణ 3 వారాలు వాయిదా
బష్మాసురిడిలా మీ నెత్తిన చేయిపెట్టాడు.. కలియుగ బష్మాసురిడ్ని అంతం చేయటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్.. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క.. బస్సులు కూడా సరిగా లేవు.. రూ.20 కోట్లతో జగన్ బుల్లెట్ ప్రూప్ బస్సులు తెప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనం వృధా చేస్తున్నాడు.. పేదలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తం త్రాగే వ్యక్తి పేదవాడు అవుతాడా.? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్.. నేడు ఎంత..? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు. జగన్ నాటకాల ముందు సురభినాటకాలు కూడా పనిచేయవని విమర్శించారు. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేసారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వానికి మీరు సిద్దమా..? అని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!