Chandrababu: ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం ఆడుతున్నారు.. నేను సవాలు చేస్తున్నా ఎలా పేదవాడు అవుతావు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjuna Kharge: మోడీ వల్లనే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది..
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
టీడీపీకి కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. నా మనసుకు దగ్గరున్న జిల్లా శ్రీకాకుళం అని చంద్రబాబు అన్నారు. రా కదలిరా సభలో మాట్లాడుతూ.. అరాచక ప్రభుత్వం ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలనలో అందరూ బాధ్యులే.. తాను కూడా భాదితుడినేనని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ ను మనం తయారుచేసాం.. దానిని ఎవరూ విధ్వంసం చేయలేదని అన్నారు. ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 2029 విజన్తో అమరావతి, పొలవరం ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. అయితే.. 2024లో టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ కంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తుఫాన్ లా వచ్చిందని దుయ్యబట్టారు.
Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు.. విచారణ 3 వారాలు వాయిదా
బష్మాసురిడిలా మీ నెత్తిన చేయిపెట్టాడు.. కలియుగ బష్మాసురిడ్ని అంతం చేయటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్.. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క.. బస్సులు కూడా సరిగా లేవు.. రూ.20 కోట్లతో జగన్ బుల్లెట్ ప్రూప్ బస్సులు తెప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనం వృధా చేస్తున్నాడు.. పేదలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తం త్రాగే వ్యక్తి పేదవాడు అవుతాడా.? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్.. నేడు ఎంత..? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు. జగన్ నాటకాల ముందు సురభినాటకాలు కూడా పనిచేయవని విమర్శించారు. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేసారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వానికి మీరు సిద్దమా..? అని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!