Kiran Kumar Reddy: నేను సీఎం పదవి ఎవరినీ అడగలేదు.. దానికోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు..
- నెల్లూరు పర్యటనలో మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డి..
- నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు..
- అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదన్న మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former CM Kiran Kumar Reddy: మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు.. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా సార్లు చెప్పాను.. వాళ్లు వినకపోవడంతోనే నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..
Read Also: Feelings Song : ‘పీలింగ్స్’ సాంగ్ కి యూట్యూబ్ లో రికార్డు రెస్పాన్స్..
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీని మూడు నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు కిరణ్కుమార్.. ఇప్పటికీ కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ సమస్య ఉందన్న ఆయన.. ఆంధ్ర ప్రదేశ్ కు పోలవరం ఒక వరం. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 900 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యం అవుతుందన్నారు.. పక్క రాష్ట్రాలతో త్వరగా ఒప్పందాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణాలకు జరిగిన అన్యాయంపై నేను సీఎంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో స్టే తెచ్చాం అని గుర్తు చేసుకున్న ఆయన.. ఆ స్టే ఇప్పటికీ అలాగే ఉందన్నారు.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసికట్టుగా కృష్ణా జలాల వినియోగంపై శ్రద్ద పెట్టాలి. అమరావతిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎంత వేగంగా అభివృద్ధి చేస్తే, అంతకంటే వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు..
Read Also: Vijay Devarakonda : ఈ సారి తగ్గేదేలే.. VD 14 కూడా పెద్ద ప్లానింగేనా..?
ఏపీ అప్పుల మయంగా మారింది.. అభివృద్దిలో బాగా వెనుకపడ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం కిరణ్.. అభివృద్దిని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జమిలి ఎన్నికల బిల్లుతో పాటు మరిన్ని బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉందన్నారు.. కరోనా వంటి గడ్డు పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.. ఇప్పుడు సెన్సెక్ పెరుగుతోందన్నారు.. మరోవైపు, వైఎస్ జగన్ కు బీజేపీ సపోర్టు చేస్తుందని అనడం సరికాదని హితవు చెప్పారు.. అది కోర్టుల్లో ఉన్న వ్యవహారం. సీబీఐ, ఈడీ, కోర్టులకు సంబంధించినది. ఏడాదిలోపే విచారణ పూర్తి కావాల్సి ఉన్నా, ప్రజాస్వామ్యంలో లొసుగుల వల్ల జాప్యం జరుగుతుండవచ్చు అన్నారు.. ఇక, బీజేపీ రాష్ట్రంలో బలోపేతం అవుతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!