తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మిస్సమ్మ’, ‘స్వయంవరం’ వంటి చిత్రాలతో హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న నటి లయ, దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ శివాజీతో జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ నెల మార్చి 6న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లయ హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాత్ర గురించి, కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!
‘లయ అనగానే అందరికీ ఏడవడం లేదా ఏడిపించే సాఫ్ట్ పాత్రలే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో నాలోని మరో కోణాన్ని చూస్తారు. ఇందులో నేను ‘ఉత్తర’ అనే స్వార్థపరురాలైన భార్య పాత్రలో కనిపిస్తాను. నా కొడుకు, నేను కలిసి చేసే పనుల వల్ల భర్త (శివాజీ)కి ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూనే ఉంటాను. మంగపతి లాంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన శివాజీని ఈ సినిమాలో నా పాత్ర డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ అంతా కలిసి చేసిన తప్పు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అనే అంశం చాలా వినోదాత్మకంగా, థ్రిల్లింగ్గా సాగుతుంది’ అని లయ వివరించారు. అంతే కాదు..
‘నా పై ఉన్న పాత ముద్రను చెరిపేసి,సీరియస్.. శక్తివంతమైన పాత్రలు చేయలనుకుంటున్న. ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ‘వదలా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్, అలాగే శ్రీకాంత్-జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ‘యమలీల’ తరహాలో సాగే ఒక సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్న. కథలో ప్రాధాన్యత ఉంటే చిన్న పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే’ అరి లయ స్పష్టం చేశారు. ఈటీవీ విన్ శివాజీ సంయుక్తంగా నిర్మించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.