Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డిని 3 గంటలు విచారించిన సీబీఐ.. అంతా కాకాని పుణ్యమేనన్న మాజీమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy Fires On Kakani Govardhan Reddy After CBI Interrogation: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సీబీఐ అధికారులు.. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డిని మూడు గంటల పాటు విచారించారు. ఇదివరకే ఆయన్ను ఈ కేసులో నెల్లూరు జిల్లా కార్యాయలంలో విచారించగా, తాజాగా మళ్లీ ప్రశ్నించారు. ఈసారి న్యాయవాదితో పాటు విచారణకు హాజరైన సోమిరెడ్డి.. ఈ సందర్భంగా ఆయన పెన్ డ్రైవ్తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ సూచించింది. మరో వారంలో పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Married Woman Molested: రుణం ఇప్పిస్తానన్నాడు.. బైక్ ఎక్కగానే షాకిచ్చాడు
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ.. మరోసారి తనని సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. పెన్ డ్రైవ్తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని.. తనకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం కలిగిందని సెటైర్ వేశారు. మరో వారంలో మళ్లీ పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు. గతంలో చంద్రమోహన్ రెడ్డి మీద సీబీఐ, ఈడీల వద్దకు వెళ్తానని కాకాని చెప్పారని.. ఇప్పుడు సీబీఐ తన మీద కేసు పెట్టిందని అన్నారు. కాకాని ఎప్పుడూ నిజం చెప్పడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఈ కేసులో కాకాని పాపం తప్పకుండా పండుతుందని ఉద్ఘాటించారు. పరునష్టం దావాకు సంబంధించి తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయని.. ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
కోర్టులో జరిగిన దొంగతనం కేసు కూడా చాలా కీలకంగా మారుతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టులో ఒక రాజకీయ వేత్త దొంగతనం చేయించడం సంచలనంగా మారిందన్నారు. రాజకీయ ప్రత్యర్థైన తన మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని.. కాకాని రూపొందించిన డాక్యుమెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్ను సీఎం జగన్కి కూడా పంపిస్తానని అన్నారు. దాన్ని చూసి, కాకానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాను కోరుతున్నానన్నారు. తాను పెట్టిన మూడు కేసుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇంత దిగజారి కుటుంబాలను నాశనం చేసేందుకు తప్పుడు పత్రాలు విడుదల చేయకుండా చూస్తామని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!