Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డిని 3 గంటలు విచారించిన సీబీఐ.. అంతా కాకాని పుణ్యమేనన్న మాజీమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy Fires On Kakani Govardhan Reddy After CBI Interrogation: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సీబీఐ అధికారులు.. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డిని మూడు గంటల పాటు విచారించారు. ఇదివరకే ఆయన్ను ఈ కేసులో నెల్లూరు జిల్లా కార్యాయలంలో విచారించగా, తాజాగా మళ్లీ ప్రశ్నించారు. ఈసారి న్యాయవాదితో పాటు విచారణకు హాజరైన సోమిరెడ్డి.. ఈ సందర్భంగా ఆయన పెన్ డ్రైవ్తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ సూచించింది. మరో వారంలో పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Married Woman Molested: రుణం ఇప్పిస్తానన్నాడు.. బైక్ ఎక్కగానే షాకిచ్చాడు
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ.. మరోసారి తనని సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. పెన్ డ్రైవ్తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని.. తనకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం కలిగిందని సెటైర్ వేశారు. మరో వారంలో మళ్లీ పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు. గతంలో చంద్రమోహన్ రెడ్డి మీద సీబీఐ, ఈడీల వద్దకు వెళ్తానని కాకాని చెప్పారని.. ఇప్పుడు సీబీఐ తన మీద కేసు పెట్టిందని అన్నారు. కాకాని ఎప్పుడూ నిజం చెప్పడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఈ కేసులో కాకాని పాపం తప్పకుండా పండుతుందని ఉద్ఘాటించారు. పరునష్టం దావాకు సంబంధించి తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయని.. ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
కోర్టులో జరిగిన దొంగతనం కేసు కూడా చాలా కీలకంగా మారుతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టులో ఒక రాజకీయ వేత్త దొంగతనం చేయించడం సంచలనంగా మారిందన్నారు. రాజకీయ ప్రత్యర్థైన తన మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని.. కాకాని రూపొందించిన డాక్యుమెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్ను సీఎం జగన్కి కూడా పంపిస్తానని అన్నారు. దాన్ని చూసి, కాకానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాను కోరుతున్నానన్నారు. తాను పెట్టిన మూడు కేసుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇంత దిగజారి కుటుంబాలను నాశనం చేసేందుకు తప్పుడు పత్రాలు విడుదల చేయకుండా చూస్తామని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!