Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ
- సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన SLBC సమావేశం..
- హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. బ్యాంకర్లు
- కౌలు రైతు రుణాలపై సమావేశంలో ప్రత్యేక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు.
Read Also: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. సిబిల్ స్కోరును ప్రత్యేకంగా చర్చించకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో రుణాల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకుంటామని SLBC లీడ్ బ్యాంక్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ జీఎం తెలిపారు.
Read Also: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ప్రత్యేకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్ళలో ఆగిపోయిన సంక్షేమం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే మా ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, కష్టపడి పని చేసే యువత ఏపీకి ఉన్న అదృష్టం.. ప్రధాని అత్యంత అద్భుతమైన స్కీంలు పెట్టి.. బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నారు.. బ్యాంకులు టార్గెట్లు పూర్తి చేయకుండా.. ఇలా సమావేశాలు పెట్టుకోవడమే సరిపోతుంది.. ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి కనుక్కుంటున్నా ఇంకా ఏదీ ముందుకు వెళ్ళడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!