Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ
- సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన SLBC సమావేశం..
- హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. బ్యాంకర్లు
- కౌలు రైతు రుణాలపై సమావేశంలో ప్రత్యేక సమీక్ష..
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు.
Read Also: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
Also Read
ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. సిబిల్ స్కోరును ప్రత్యేకంగా చర్చించకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో రుణాల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకుంటామని SLBC లీడ్ బ్యాంక్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ జీఎం తెలిపారు.
Read Also: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ప్రత్యేకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్ళలో ఆగిపోయిన సంక్షేమం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే మా ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, కష్టపడి పని చేసే యువత ఏపీకి ఉన్న అదృష్టం.. ప్రధాని అత్యంత అద్భుతమైన స్కీంలు పెట్టి.. బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నారు.. బ్యాంకులు టార్గెట్లు పూర్తి చేయకుండా.. ఇలా సమావేశాలు పెట్టుకోవడమే సరిపోతుంది.. ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి కనుక్కుంటున్నా ఇంకా ఏదీ ముందుకు వెళ్ళడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!