Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ
- సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన SLBC సమావేశం..
- హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. బ్యాంకర్లు
- కౌలు రైతు రుణాలపై సమావేశంలో ప్రత్యేక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు.
Read Also: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. సిబిల్ స్కోరును ప్రత్యేకంగా చర్చించకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో రుణాల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకుంటామని SLBC లీడ్ బ్యాంక్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ జీఎం తెలిపారు.
Read Also: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ప్రత్యేకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్ళలో ఆగిపోయిన సంక్షేమం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే మా ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, కష్టపడి పని చేసే యువత ఏపీకి ఉన్న అదృష్టం.. ప్రధాని అత్యంత అద్భుతమైన స్కీంలు పెట్టి.. బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నారు.. బ్యాంకులు టార్గెట్లు పూర్తి చేయకుండా.. ఇలా సమావేశాలు పెట్టుకోవడమే సరిపోతుంది.. ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి కనుక్కుంటున్నా ఇంకా ఏదీ ముందుకు వెళ్ళడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!