Sea Waves: తీరప్రాంతంలో అలజడి.. హుదూద్ తర్వాత ఆ స్థాయిలో విరుచుకుపడుతోన్న అలలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీర ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది.. హుదూద్ తుఫాన్ తర్వాత ఆ స్థాయిలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి… విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం సమీపంలో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది.. తీరంలో ఐదు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి.. సుమారు 150 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రహదారులు కోతకు గురయ్యాయి.. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంస అయ్యాయి…. ఇప్పటికే సముద్రం ఒడ్డున ఉన్న రెండు రచ్చబండలు, వలలు భద్రపరుకునే పాకలు సైతం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.. రాకాసి అలలు విరిచుకుపడుతుండడంతో తీరప్రాంతంలోని మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: India Economy: ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా
Also Read
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
మరోవైపు.. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది… ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ… వరద ఉధృతిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. సహాయక చర్యలకోసం అల్లూరి జిల్లా కూనవరం, వి.ఆర్ పురంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను దించారు.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు సూచిస్తున్నారు.. లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!