Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు..
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు..
- కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం..
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం, బ్యాగ్స్ పంపిణీ: లోకేష్
Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను ప్రభుత్వం అందించనుంది. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బెల్టులను అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రదర్శించారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..
Also Read
- Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఇక, గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం దారుణంగా దెబ్బతినింది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల్లో బొమ్మలు వేసుకునేందుకు జగన్ ప్రభుత్వం 9 పేజీలు కేటాయించింది.. దీని కోసమే రూ. 30 లక్షల రూపాయలు వెచ్చించారు.. విద్యార్ధులు రాసుకునే వర్క్ పుస్తకంపై కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు అని ఆయన ఆరోపిచారు. స్కూల్ బ్యాగు, బెల్టు, గుడ్లపైనా స్టాంపులు వేసుకున్న పరిస్థితి గతంలో ఉంది.. ప్రస్తుతం వాటన్నిటీని తొలగించాం.. తద్వారా విద్యార్ధుల కిట్లపైనే రూ.300 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యాయని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఫోటోల పిచ్చిలేదు, రాజకీయ నాయకుల ఫోటోలను విద్యార్థులపై రుద్దకూడదన్నది మా నిర్ణయం అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: US-Ukraine Peace Talks: సౌదీ వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చలు..
కాగా, యూనిఫాం సహా చిక్కీలు, గుడ్లు ఇలా వివిధ సరఫరా దారులకు రూ.352 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం పెట్టిందని మంంత్రి లోకేష్ తెలిపారు. బైజూస్ కోసమని ట్యాబ్స్ ఇచ్చారు.. వాటిని చాలా మంది తల్లితండ్రులు వద్దని చెప్పారు.. ప్రతీ పిల్లవాడికీ సాంకేతికత అవసరమే అందుకే కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16.6 శాతం అడ్మిషన్లు పెరిగాయి.. రాష్ట్రంలోని యూని వర్సిటీలకు అసలు ర్యాంకింగే లేకుండా పోయాయి.. కేజీ నుంచి పీజీ వరకూ వ్యవస్థీకృత విధానం ఉండాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు జరక్కూడదనే సర్కార్ ప్రయత్నిస్తోంది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Viral: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్.. TMC పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
-
Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
-
Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
-
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్లో తెగ వెతికేస్తున్నారుగా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!