Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్ కోరిక తీరదు.. వికేంద్రీకరణే మా విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీంకోర్టు భావించిందన్నారు. ప్రభుత్వ విధానాలలో తప్పోపులను నిర్ణయంచాల్సింది ప్రజలే అని.. ఈ అంశం ప్రజా కోర్టులోనే ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు. అలాంటపుడు మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదని సజ్జల అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకున్నందుకు వైసీపీకి అన్ని ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారని సజ్జల అన్నారు. ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుని ఉంటే గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేదని.. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న చంద్రబాబు నిర్ణయానికి ప్రజల మద్దతు లభించలేదని తెలిపారు. గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టలేమని తేలిపోయిందన్నారు. జగన్ మూడు రాజధానులు చట్టం చేసిన తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో జనం మద్దతు తెలిపారన్నారు.
Also Read
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Read Also: Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్ 5న కర్నూలులో సభ నిర్వహించే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం సంతోషంగా ఉందని సజ్జల తెలిపారు. సుప్రీంకోర్టు స్టే మా విధానాలను తప్పుబట్టే వారికి మొట్టికాయ లాంటిదన్నారు. త్వరలోనే న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తే న్యాయవ్యవస్థ చెక్ పెట్టవచ్చని.. ప్రభుత్వ నిర్ణయం నచ్చకుంటే ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. అటు చంద్రబాబును అర్జెంటుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరిక తీరదని సజ్జల జోస్యం చెప్పారు. ప్రజలు పవన్ కోరికను అంగీకరించడం లేదన్న సంగతిని గుర్తించాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..