Sahithi Pharma Incident: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. ప్రారంభమైన విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sahithi Pharma Rescue Operation Ended: అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలడంతో, మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే.. రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 ఫైర్ ఇంజన్లు, స్కై లిఫ్టర్ల సహాయంతో.. ఐదు గంటలకు పైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కెమికల్స్ని అన్లోడ్ చేస్తున్నప్పుడు.. రసాయనాలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలోనే కంటైనర్కి నిప్పు అంటుకోవడంతో, నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో సాహితీ ఫార్మా యూనిట్-1 మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది.
Masala Mirchi Bajji : మసాలా మిర్చి బజ్జిలను ఇలా చెయ్యండి..టేస్ట్ వేరే లెవల్..
Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
కాగా.. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో.. చాలామంది వెంటనే పరుగులు తీశారు. అయితే.. ఏడుగురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వారిని వెంటనే దగ్గరలోనే కేజీహెచ్కి తరలించారు. కానీ.. వీరిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతూ పైల సత్తిబాబు మరణించగా.. కేజీహెచ్కు తీసుకువస్తుండగానే, మార్గమధ్యలో తిరుపతి చనిపోయాడు. ఈ ఘటనతో సేఫ్టీ ఆడిట్ చర్చనీయాంశంగా మారింది. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో 200కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ కావడంతో.. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు.. మృతి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మంత్రి అమర్నాథ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Prabhas – Maruthi Film: ఫాన్స్ దెబ్బకి టైటిల్ మార్చేశారా? కొత్త టైటిల్ అదేనట!
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!