Sahithi Pharma Incident: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. ప్రారంభమైన విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sahithi Pharma Rescue Operation Ended: అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలడంతో, మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే.. రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 ఫైర్ ఇంజన్లు, స్కై లిఫ్టర్ల సహాయంతో.. ఐదు గంటలకు పైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కెమికల్స్ని అన్లోడ్ చేస్తున్నప్పుడు.. రసాయనాలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలోనే కంటైనర్కి నిప్పు అంటుకోవడంతో, నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో సాహితీ ఫార్మా యూనిట్-1 మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది.
Masala Mirchi Bajji : మసాలా మిర్చి బజ్జిలను ఇలా చెయ్యండి..టేస్ట్ వేరే లెవల్..
Also Read
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
కాగా.. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో.. చాలామంది వెంటనే పరుగులు తీశారు. అయితే.. ఏడుగురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వారిని వెంటనే దగ్గరలోనే కేజీహెచ్కి తరలించారు. కానీ.. వీరిలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతూ పైల సత్తిబాబు మరణించగా.. కేజీహెచ్కు తీసుకువస్తుండగానే, మార్గమధ్యలో తిరుపతి చనిపోయాడు. ఈ ఘటనతో సేఫ్టీ ఆడిట్ చర్చనీయాంశంగా మారింది. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో 200కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ కావడంతో.. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు.. మృతి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మంత్రి అమర్నాథ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Prabhas – Maruthi Film: ఫాన్స్ దెబ్బకి టైటిల్ మార్చేశారా? కొత్త టైటిల్ అదేనట!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!