RK Roja: పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు..
- కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీమంత్రి ఆర్కే రోజా..
- సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు..
- పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు: ఆర్కే రోజా
RK Roja: నాలుగో సారి సీఎంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు అని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇప్పుడు ఏదో మొదలు పెట్టారు.. మాట్లాడితే జగన్ బెంగుళూరు వెళ్తున్నారు అంటున్నారు.. గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించింది. శుక్రవారం అయితే హైదరాబాద్ కి వెళ్లి పోతున్నారు.. మీరు హైదరాబాద్ లో ఉండటం వల్లే వరదలకు విజయవాడ మునిగి పోయింది.. అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్ లో తిరుగుతున్నారని జనాలు నవ్వుకుంటున్నారు.. ఇక, చంద్రబాబు తన కేసులపై విచారణ ముందు చేయించుకోవాలి.. కుంటి సాకులతో కేసుల నుంచి బయటకు వచ్చారంటూ వైసీపీ నేత ఆర్కే రోజా పేర్కొనింది.
Read Also: Vivo T4 5G: మిడ్ రేంజ్లో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలైన వివో T4 5G
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, అమరావతిని దోచుకోవాలని అనుకున్న చంద్రబాబుపై ప్రధాని మోడీ విచారణ చేయించాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. ప్రధాని తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. అయితే, వైజాగ్ ను రాజధాని చేయాలని జగన్ కలలు కన్నారు.. పరిపాలన రాజధాని చేస్తే వైసీపీ వల్ల అరాచకాలు చేస్తారని భయ పెట్టారు.. వైజాగ్ లో 60 రోజుల ముందు పుట్టిన ఉర్సా కంపెనీకి మూడు వేల కోట్ల భూములు దారాదత్తం చేశారు.. దావోస్ లో వీళ్లకు ఒక్క ఎంఓయూ కూడా కాలేదు.. హైదరాబాద్ లో వీళ్ళు ఇచ్చిన కంపెనీకి బోర్డులు, అడ్రస్ లు కూడా లేవు.. టీడీపీకి చెందిన ఓ ఎంపీ స్నేహితుడి కంపెనీకి ఎకరాలకు ఎకరాల భూములు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇబ్బందులపై వైసీపీ అండగా నిలబడుతుంది అని మాజీ మంత్రి రోజా తెలిపింది.
Read Also: Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు ప్రపంచ స్థాయి అవార్డు
అలాగే, హిందువులు పూజించే గోమాతలు మృతి చెందుతున్నప్పటికీ చంద్రబాబు ఒప్పుకోవటం లేదు అని వైసీపీ నేత రోజా అన్నారు. ఇప్పటికే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. ఈ ఏడాదిలో తిరుమలలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి.. చెప్పులు వేసుకుని గుళ్ళకు వస్తున్నారు.. తిరుమలలో ఏం జరుగుతుందో కూడా చూడాలని సూచించింది. శ్రీకూర్మంలో అన్నీ తాబేళ్లు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు.. ప్రజలకు మంచి చేయటానికి వీళ్లకు టైం లేదు.. ఇక, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించింది. బీజేపీ వాళ్ళు ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు సరిదిద్దటం లేదు.. కూటమిలో ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా సమర్థిస్తారా అని ఆర్కే రోజా అడిగింది.
Read Also: YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..!
కాగా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా.. ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించింది. ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో వీళ్ళ కుట్రలపై మాట్లాడుతున్నారు కాబట్టే కేసులు పెట్టారని పేర్కొనింది. ఆయనపై ఏ ప్రాతిపదికన విచారణ చేస్తున్నారో అర్ధం కావటం లేదు.. జగన్ స్కీములు మాత్రమే చేశారు.. జగన్ బటన్లు నొక్కితే అవినీతి జరిగే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. అయితే, చంద్రబాబు ప్రస్తుతం దోచుకునే పనులు చేస్తున్నారు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు.. వీటి వల్ల మద్యం మత్తులో దాడులు కూడా పెరిగాయి.. ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో