YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..!
- వైసీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టిన పార్టీ..
- పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం..
- వైసీపీ పీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైసీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టిన పార్టీ.. అంతేకాదు పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నామని గుర్తుచేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పీఏసీ సమావేశంలో నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దశ, దిశను నిర్ణయిస్తాయి. ప్రతి అంశం మీద పార్టీకి దిశా నిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. పార్టీ ఏం చేయాలన్న దానిపైన కూడా తగిన ఆలోచనలు చేస్తుంది.. సలహాలు ఇస్తుందన్నారు.. ఇప్పుడు పార్టీని పునర్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ బాడీలను నిర్మిస్తూ వస్తున్నాం. జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లు, పీఏసీ ఏర్పాటు ఇలా అన్నిరకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది.. గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలి.. బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి.. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు.
Read Also: US India trade deal: అమెజాన్, వాల్మార్ట్కి పూర్తి మార్కెట్ యాక్సెస్.. భారత్పై అమెరికా ఒత్తిడి..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఇక, ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. పోరాటాలు ముమ్మరం చేస్తాం అన్నారు వైఎస్ జగన్.. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలన్న ఆయన.. పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుందన్నారు.. పార్టీకి పెద్దగా మీడియా లేదు.. కానీ, టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి.. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. గ్రామస్థాయిలో కార్యకర్తను తయారుచేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధానాన్ని వాడుకోవాలని సూచించారు.. కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిపై వ్యతిరేకతను మూసేయడానికి ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారన్నారు..
Read Also: OPPO K12s: 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానున్న ఒప్పో K12s
చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది..? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు అన్నారు జగన్.. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారని గుర్తుచేసుకున్నారు.. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారని తెలిపారు.. ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి.. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి, పోరాటంచేయాలి.. ఎలాంటి రాజీపడొద్దు అంటూ దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!