Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని కోరుకున్నా.. శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి ప్రసాదం సెలవు సందర్భంగా రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామి కోరుకున్నానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల అవినీతికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఈరోజు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఫలితమే మేడిగడ్డ ప్రాజెక్టు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మపురి ప్రాంతం సంపద పొంది అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read
🔥ధర్మపురి..
కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయి.. అభివృద్ధి జరిగింది.
కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది.సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది.
తెలంగాణలో మార్పు… pic.twitter.com/tC2ENDSilD
— Revanth Reddy (@revanth_anumula) November 12, 2023
మరోవైపు కలియుగ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరి కిటకిటలాడింది. నిన్న 71,690 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 24,993 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.87 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారి దర్శనం కోసం 21 కోచ్లు వేచి ఉన్నాయి. 8 గంటల్లో అందరి దర్శనం జరుగుతుందని వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నందున బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేసి అర్చన, తోమాల సేవలు వేర్వేరుగా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!