Minister Nimmala Ramanaidu: వారి పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..
- జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..
- టీడీపీ పాలనలో 96 శాతం నిధులు ఖర్చు చేశాం..
- గత ఐదేళ్లలో జగన్ పాలనలో 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం అని దుయ్యబట్టారు..
Read Also: Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
రెండో టన్నెల్ లో తవ్విన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారు.. మట్టిని తొలగించకుండా నీరు వదలడం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు నిమ్మల.. రెండో టన్నెల్ 12వ కిలో మీటర్ వద్ద మూడేళ్ల క్రితమే టన్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోతే ఎందుకు బయటకు తీయలేకపోయారు..? అని నిలదీశారు.. టీబీఎం మెషిన్ బయటకు తీయకుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా..? రెండు టన్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు తరలించాల్సి ఉండగా.. కనీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏంటంటూ మండిపడ్డారు.. 53 టీఎంసీల సామరథ్యం ఉన్న నల్లమలసాగర్ లో కనీసం అర టీఎంసీ నీరు కూడా నిల్వ చేయలేని పరిస్థితి.. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జగన్ మోహాన్ రెడ్డి విధ్వంసమే కనిపిస్తోంది.. కడప జిల్లాకు చెందిన తమ అనుచరుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు అప్పగించారు.. పనులు పూర్తి చేయకుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.
Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..
2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతులకు నోటీసులు ఇచ్చి సభకు రాకుండా అడ్డకున్నారని విమర్శించారు మంత్రి నిమ్మల.. గత ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరికైనా పునరావాసం చేశామని చెప్పే ధైర్యం ఉందా..? అని సవాల్ చేశారు.. ఒక్క గ్రామానికి కూడా పునరావాస కాలనీలు నిర్మించి వారిని తరలించే పని చేపట్టలేదు. ఫీడర్ కెనాల్ అధ్వాన స్దితిలో ఉంది.. దాని నుంచి నల్లమల సాగర్ కు నీరు వదిలితే అది ఐదారు చోట్ల తెగి రిజర్వాయర్లోకి చుక్క నీరు చేరదు అన్నారు.. అయితే, రెండు దశల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.. ఫేజ్-1లో హెడ్ వర్క్స్, రెండు టన్నెల్స్, ఫీడర్ ఛానెల్, రిజర్వాయర్, రెగ్యులేటర్ వంటి నిలిచినపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!