Minister Nimmala Ramanaidu: వారి పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..
- జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..
- టీడీపీ పాలనలో 96 శాతం నిధులు ఖర్చు చేశాం..
- గత ఐదేళ్లలో జగన్ పాలనలో 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం అని దుయ్యబట్టారు..
Read Also: Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్
Also Read
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
రెండో టన్నెల్ లో తవ్విన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారు.. మట్టిని తొలగించకుండా నీరు వదలడం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు నిమ్మల.. రెండో టన్నెల్ 12వ కిలో మీటర్ వద్ద మూడేళ్ల క్రితమే టన్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోతే ఎందుకు బయటకు తీయలేకపోయారు..? అని నిలదీశారు.. టీబీఎం మెషిన్ బయటకు తీయకుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా..? రెండు టన్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు తరలించాల్సి ఉండగా.. కనీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏంటంటూ మండిపడ్డారు.. 53 టీఎంసీల సామరథ్యం ఉన్న నల్లమలసాగర్ లో కనీసం అర టీఎంసీ నీరు కూడా నిల్వ చేయలేని పరిస్థితి.. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జగన్ మోహాన్ రెడ్డి విధ్వంసమే కనిపిస్తోంది.. కడప జిల్లాకు చెందిన తమ అనుచరుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు అప్పగించారు.. పనులు పూర్తి చేయకుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.
Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..
2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతులకు నోటీసులు ఇచ్చి సభకు రాకుండా అడ్డకున్నారని విమర్శించారు మంత్రి నిమ్మల.. గత ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరికైనా పునరావాసం చేశామని చెప్పే ధైర్యం ఉందా..? అని సవాల్ చేశారు.. ఒక్క గ్రామానికి కూడా పునరావాస కాలనీలు నిర్మించి వారిని తరలించే పని చేపట్టలేదు. ఫీడర్ కెనాల్ అధ్వాన స్దితిలో ఉంది.. దాని నుంచి నల్లమల సాగర్ కు నీరు వదిలితే అది ఐదారు చోట్ల తెగి రిజర్వాయర్లోకి చుక్క నీరు చేరదు అన్నారు.. అయితే, రెండు దశల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.. ఫేజ్-1లో హెడ్ వర్క్స్, రెండు టన్నెల్స్, ఫీడర్ ఛానెల్, రిజర్వాయర్, రెగ్యులేటర్ వంటి నిలిచినపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!