Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Nimmala Ramanaidu About Veligonda Project

Minister Nimmala Ramanaidu: వారి పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 ద‌శ‌ల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..

Published Date :October 29, 2024 , 12:39 pm
By Sudhakar Ravula
  • జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..
  • టీడీపీ పాల‌న‌లో 96 శాతం నిధులు ఖ‌ర్చు చేశాం..
  • గ‌త ఐదేళ్లలో జ‌గ‌న్ పాల‌న‌లో 170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేశారు..
Minister Nimmala Ramanaidu: వారి పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 ద‌శ‌ల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nimmala Ramanaidu: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాల‌న‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖ‌ర్చు చేశాం.. కానీ, గ‌త ఐదేళ్లలో జ‌గ‌న్ పాల‌న‌లో 3,518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి కేవ‌లం 170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేశారని.. జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం అని దుయ్యబట్టారు..

Read Also: Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్

రెండో ట‌న్నెల్ లో త‌వ్విన రెండు ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని మొద‌టి ట‌న్నెల్ చివ‌ర భాగాన పోశారు.. మ‌ట్టిని తొల‌గించ‌కుండా నీరు వ‌ద‌ల‌డం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు నిమ్మల.. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ వద్ద మూడేళ్ల క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోతే ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారు..? అని నిలదీశారు.. టీబీఎం మెషిన్ బ‌య‌ట‌కు తీయ‌కుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా..? రెండు ట‌న్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు త‌ర‌లించాల్సి ఉండ‌గా.. క‌నీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏంటంటూ మండిపడ్డారు.. 53 టీఎంసీల సామ‌రథ్యం ఉన్న న‌ల్లమ‌ల‌సాగ‌ర్ లో క‌నీసం అర‌ టీఎంసీ నీరు కూడా నిల్వ చేయ‌లేని ప‌రిస్థితి.. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ మోహాన్ రెడ్డి విధ్వంసమే క‌నిపిస్తోంది.. క‌డ‌ప జిల్లాకు చెందిన త‌మ అనుచ‌రుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేట‌ర్ ప‌నులు అప్పగించారు.. ప‌నులు పూర్తి చేయ‌కుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.

Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..

2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతుల‌కు నోటీసులు ఇచ్చి స‌భ‌కు రాకుండా అడ్డకున్నారని విమర్శించారు మంత్రి నిమ్మల.. గ‌త ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరికైనా పున‌రావాసం చేశామ‌ని చెప్పే ధైర్యం ఉందా..? అని సవాల్‌ చేశారు.. ఒక్క గ్రామానికి కూడా పున‌రావాస కాల‌నీలు నిర్మించి వారిని త‌ర‌లించే ప‌ని చేప‌ట్టలేదు. ఫీడ‌ర్ కెనాల్ అధ్వాన స్దితిలో ఉంది.. దాని నుంచి న‌ల్లమ‌ల సాగ‌ర్ కు నీరు వ‌దిలితే అది ఐదారు చోట్ల తెగి రిజర్వాయర్లోకి చుక్క నీరు చేరదు అన్నారు.. అయితే, రెండు ద‌శ‌ల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.. ఫేజ్-1లో హెడ్ వ‌ర్క్స్, రెండు ట‌న్నెల్స్, ఫీడ‌ర్ ఛానెల్, రిజ‌ర్వాయ‌ర్, రెగ్యులేట‌ర్ వంటి నిలిచిన‌పోయిన ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే సీజ‌న్ నాటికి 1.19 ల‌క్షల ఎక‌రాల‌కు నీళ్లు అందించాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Minister Nimmala Ramanaidu
  • tdp
  • Veligonda Project

తాజావార్తలు

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు బిగ్ ట్విస్ట్

  • SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

  • Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన

  • Suryakumar Yadav: “నా నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ పక్కా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

  • Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

  • Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions