Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో రహస్య తవ్వకాల ఆరోపణలు
- అటవీ అధికారులే జేసీబీతో నిధుల వేటకు దిగారా?
- కుండల్లో బంగారం, వజ్రాల ప్రచారంతో హాట్ టాపిక్
- విచారణకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. నిజాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidden Treasure : ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ (Tiger Project) పరిధిలోని ఆరవీటికోట అటవీ ప్రాంతంలో ఊహించని ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిని, అందులోని వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ (Forest Department) అధికారులే స్వయంగా గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.
తురిమెళ్ళ ఫారెస్ట్ రేంజ్కు చెందిన ఒక మహిళా అధికారి, తన కింది స్థాయి సిబ్బంది , కొందరు ట్రైబల్ వాచర్లతో (Tribal Watchers) కలిసి ఈ అక్రమ తవ్వకాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒక జేసీబీ (JCB) వాహనాన్ని తీసుకెళ్లి, రాత్రికి రాత్రే భారీగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. నమ్మకమైన సిబ్బందితో కలిసి ఆఫీసర్లే ఈ పని చేయించడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ఈ సీక్రెట్ తవ్వకాల్లో కొన్ని ప్రాచీన కాలం నాటి మట్టి కుండలు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. ఆ కుండలలో భారీగా బంగారం, విలువైన వజ్రాలు ఉన్నాయని, అధికారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు (Bengaluru) నగరానికి తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నిధుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఈ గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు దీనిపై క్లారిఫికేషన్ కోసం ప్రయత్నించారు. అయితే, సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎవరూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆ మహిళా అధికారితో పాటు అక్రమ తవ్వకాల్లో పాల్గొన్న సిబ్బంది అందరూ అందుబాటులో లేకుండా పరారైనట్లు తెలుస్తోంది.
రక్షకభటులే భక్షకులుగా మారి.. అటవీ సంపదను నాశనం చేస్తూ నిధుల వేట పడటంపై హయ్యర్ అఫీషియల్స్ సీరియస్ అయ్యారు. ఈ పూర్తి ఘటనపై ఉన్నతాధికారులు లోతైన విచారణకు (Enquiry) ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!