Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో రహస్య తవ్వకాల ఆరోపణలు
- అటవీ అధికారులే జేసీబీతో నిధుల వేటకు దిగారా?
- కుండల్లో బంగారం, వజ్రాల ప్రచారంతో హాట్ టాపిక్
- విచారణకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. నిజాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidden Treasure : ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ (Tiger Project) పరిధిలోని ఆరవీటికోట అటవీ ప్రాంతంలో ఊహించని ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిని, అందులోని వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ (Forest Department) అధికారులే స్వయంగా గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.
తురిమెళ్ళ ఫారెస్ట్ రేంజ్కు చెందిన ఒక మహిళా అధికారి, తన కింది స్థాయి సిబ్బంది , కొందరు ట్రైబల్ వాచర్లతో (Tribal Watchers) కలిసి ఈ అక్రమ తవ్వకాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒక జేసీబీ (JCB) వాహనాన్ని తీసుకెళ్లి, రాత్రికి రాత్రే భారీగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. నమ్మకమైన సిబ్బందితో కలిసి ఆఫీసర్లే ఈ పని చేయించడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు.
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
ఈ సీక్రెట్ తవ్వకాల్లో కొన్ని ప్రాచీన కాలం నాటి మట్టి కుండలు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. ఆ కుండలలో భారీగా బంగారం, విలువైన వజ్రాలు ఉన్నాయని, అధికారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు (Bengaluru) నగరానికి తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నిధుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఈ గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు దీనిపై క్లారిఫికేషన్ కోసం ప్రయత్నించారు. అయితే, సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎవరూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆ మహిళా అధికారితో పాటు అక్రమ తవ్వకాల్లో పాల్గొన్న సిబ్బంది అందరూ అందుబాటులో లేకుండా పరారైనట్లు తెలుస్తోంది.
రక్షకభటులే భక్షకులుగా మారి.. అటవీ సంపదను నాశనం చేస్తూ నిధుల వేట పడటంపై హయ్యర్ అఫీషియల్స్ సీరియస్ అయ్యారు. ఈ పూర్తి ఘటనపై ఉన్నతాధికారులు లోతైన విచారణకు (Enquiry) ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!