Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో రహస్య తవ్వకాల ఆరోపణలు
- అటవీ అధికారులే జేసీబీతో నిధుల వేటకు దిగారా?
- కుండల్లో బంగారం, వజ్రాల ప్రచారంతో హాట్ టాపిక్
- విచారణకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. నిజాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidden Treasure : ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ (Tiger Project) పరిధిలోని ఆరవీటికోట అటవీ ప్రాంతంలో ఊహించని ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిని, అందులోని వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ (Forest Department) అధికారులే స్వయంగా గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.
తురిమెళ్ళ ఫారెస్ట్ రేంజ్కు చెందిన ఒక మహిళా అధికారి, తన కింది స్థాయి సిబ్బంది , కొందరు ట్రైబల్ వాచర్లతో (Tribal Watchers) కలిసి ఈ అక్రమ తవ్వకాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒక జేసీబీ (JCB) వాహనాన్ని తీసుకెళ్లి, రాత్రికి రాత్రే భారీగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. నమ్మకమైన సిబ్బందితో కలిసి ఆఫీసర్లే ఈ పని చేయించడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఈ సీక్రెట్ తవ్వకాల్లో కొన్ని ప్రాచీన కాలం నాటి మట్టి కుండలు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. ఆ కుండలలో భారీగా బంగారం, విలువైన వజ్రాలు ఉన్నాయని, అధికారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు (Bengaluru) నగరానికి తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నిధుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఈ గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు దీనిపై క్లారిఫికేషన్ కోసం ప్రయత్నించారు. అయితే, సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎవరూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆ మహిళా అధికారితో పాటు అక్రమ తవ్వకాల్లో పాల్గొన్న సిబ్బంది అందరూ అందుబాటులో లేకుండా పరారైనట్లు తెలుస్తోంది.
రక్షకభటులే భక్షకులుగా మారి.. అటవీ సంపదను నాశనం చేస్తూ నిధుల వేట పడటంపై హయ్యర్ అఫీషియల్స్ సీరియస్ అయ్యారు. ఈ పూర్తి ఘటనపై ఉన్నతాధికారులు లోతైన విచారణకు (Enquiry) ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?