Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం..
- పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన లారీ..
- నలుగురు అక్కడికక్కడే మృతి. మరో 8 మందికి తీవ్ర గాయాలు..
- పెళ్లి ముహూర్తానికి ముందే విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kambham Road Accident: ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి ముహూర్తానికి కొద్ది సేపటి ముందే పెళ్లి బృందంపైకి అదుపుతప్పిన లారీ దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్కు చెందిన పెళ్లి బృందం కంభంలో జరగనున్న వివాహానికి హాజరైంది. ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా, అంతకుముందు స్థానిక వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నిలబడి ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి నేరుగా వారిపైకి దూసుకెళ్లింది.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన అనంతరం లారీ మరో మూడు ద్విచక్ర వాహనాలు, రెండు బడ్డీ బంకులను కూడా ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వీరక్క తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో పెళ్లికూతురి ఇద్దరు సొంత అన్నలు, వదిన, మేనకోడలు ఉండటం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదానికి లారీ మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కంభం పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!