Podalakuru Gun Fire Incident: తాటిపర్తి కాల్పుల ఘటనలో కీలక దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా అనే విషయం పై ఆరా తీస్తున్నారు.
మేడ్ ఇన్ యు.ఎస్.ఏ.అని ఉన్న గన్ ను ఎక్కడ కొనుగోలు చేశారు? దీనికి ఎవరెవరు సహకరించారనే విషయాన్ని విశ్లేషిస్తున్నారు. సురేష్ రెడ్డి ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మిత్రులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మూడు నెలల నుంచి సురేష్ రెడ్డి వెళ్లిన ఊర్లు..కలిసిన వ్యక్తుల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకుని వారిని ప్రశ్నించనున్నారు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
మరో వైపు గన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. సోమవారం రాత్రి గన్ విడిభాగాలను బృందం సభ్యులు పరిశీలించారు. మేడ్ ఇన్ యూ.ఎస్.ఏ.అని ముద్రితమైన ఆ పిస్టల్ పనితీరు..ఎన్ని రౌండ్స్ ..లోడ్ చేసిన బుల్లెట్స్ ను కూడా పరిశీలించారు. కావ్య ఇంట్లో దొరికిన బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఎక్కడ నుంచి తెచ్చారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పిస్టల్ ద్వారా అయిదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు గుర్తించారు.
ఇందులో రెండు రౌండ్లు కావ్య ఇంట్లో జరపగా..మరో బుల్లెట్ తో సురేష్ రెడ్డి కాల్చుకున్నాడు. మరో రెండు బుల్లెట్లు ఎక్కడ ఉపయోగించాడనే విషయం పై దృష్టి సారించారు. ప్రాక్టీస్ కోసం ఎక్కడైనా రెండు రౌండ్లు కాల్పులు జరిపారా? అనే కోణంలో కూడా విచారిస్తున్నామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. గన్ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు గుర్తించే అవకాశం ఉందని భావించిన సురేష్ రెడ్డి ..ఇంటికి సమీపంలోని తమల పాకుల తోటలో దాచి ఉంచినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఒక పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కావ్య ఇంటికి ఎదురుగా ఉన్న స్కూల్ వద్ద సురేష్ రెడ్డి ఫుట్ ప్రింట్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద గన్ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.
Breaking: నెల్లూరులో కాల్పుల కలకలం.. ఇద్దరు టెక్కీలు మృతి
- Tags
- ap
- ap police
- Crime News
- gun
- gun fire
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!