PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్పై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిట్రోడా మాట్లాడుతూ.. తూర్పు భారతీయులు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ, కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా..? అని మోడీ ప్రశ్నించారు.
Read Also: Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
Also Read
- Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీస్గా కనిపిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా? కాంగ్రెస్ దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్ల వలె చూస్తుంది, వారు దీనిని అంగీకరిస్తారా’’ అని ప్రధాని మోడీ అడిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తమిళ సంస్కృతి, గౌరవం కోసం మాట్లాడే డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ తమ బంధాన్ని తెంచుకునే దమ్ముందా..? అని బుధవారం అడిగారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రధాని అన్నారు.
పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి భాషను అంగీకరిస్తార..? అని మోడీ ప్రశ్నించారు. ‘‘ ఉత్తర భారతీయులు తెల్లవారిలా కనిపిస్తారా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ శామ్ పిట్రోడా యువరాజు తత్వవేత్త, మార్గదర్శకుడని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను దేశం వింటోంది, అర్థం చేసుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!