PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్పై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిట్రోడా మాట్లాడుతూ.. తూర్పు భారతీయులు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ, కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా..? అని మోడీ ప్రశ్నించారు.
Read Also: Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీస్గా కనిపిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా? కాంగ్రెస్ దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్ల వలె చూస్తుంది, వారు దీనిని అంగీకరిస్తారా’’ అని ప్రధాని మోడీ అడిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తమిళ సంస్కృతి, గౌరవం కోసం మాట్లాడే డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ తమ బంధాన్ని తెంచుకునే దమ్ముందా..? అని బుధవారం అడిగారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రధాని అన్నారు.
పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి భాషను అంగీకరిస్తార..? అని మోడీ ప్రశ్నించారు. ‘‘ ఉత్తర భారతీయులు తెల్లవారిలా కనిపిస్తారా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ శామ్ పిట్రోడా యువరాజు తత్వవేత్త, మార్గదర్శకుడని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను దేశం వింటోంది, అర్థం చేసుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!