PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్పై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిట్రోడా మాట్లాడుతూ.. తూర్పు భారతీయులు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ, కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా..? అని మోడీ ప్రశ్నించారు.
Read Also: Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీస్గా కనిపిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా? కాంగ్రెస్ దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్ల వలె చూస్తుంది, వారు దీనిని అంగీకరిస్తారా’’ అని ప్రధాని మోడీ అడిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తమిళ సంస్కృతి, గౌరవం కోసం మాట్లాడే డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ తమ బంధాన్ని తెంచుకునే దమ్ముందా..? అని బుధవారం అడిగారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రధాని అన్నారు.
పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి భాషను అంగీకరిస్తార..? అని మోడీ ప్రశ్నించారు. ‘‘ ఉత్తర భారతీయులు తెల్లవారిలా కనిపిస్తారా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ శామ్ పిట్రోడా యువరాజు తత్వవేత్త, మార్గదర్శకుడని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను దేశం వింటోంది, అర్థం చేసుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..