PMGKAY Scheme: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలోని కార్డుదారులకే రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో మొత్తం 1.45 కోట్ల రేషన్ కార్డు దారులు ఉండగా వీరిలో 88.75 లక్షల మందికే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. దీంతో మిగిలిన 56.6 లక్షల మంది రేషన్ కార్డు దారులకు బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
కాగా పీఎంజీకేఏవై పథకం కింద ఏపీలో ఏప్రిల్ నుంచి బియ్యం పంపిణీ జరగడం లేదు. దీంతో ఆగస్టు నెలతో కలుపుకుంటే ఐదునెలల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున 5 నెలలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 100 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం భరించే రాయితీతో 5 నెలలకు సుమారు రూ.4వేలు విలువైన బియ్యం కార్డుదారులకు అందుతాయి. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో లేని రేషన్ కార్డు దారులు ఈ మేరకు నష్టపోవాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ వద్ద పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు లేవని.. అందుకే కూపన్లు ఇచ్చి వాటిపై విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. కాగా పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం పూర్తి వివరాలు చెప్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!