PMGKAY Scheme: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలోని కార్డుదారులకే రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో మొత్తం 1.45 కోట్ల రేషన్ కార్డు దారులు ఉండగా వీరిలో 88.75 లక్షల మందికే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. దీంతో మిగిలిన 56.6 లక్షల మంది రేషన్ కార్డు దారులకు బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
కాగా పీఎంజీకేఏవై పథకం కింద ఏపీలో ఏప్రిల్ నుంచి బియ్యం పంపిణీ జరగడం లేదు. దీంతో ఆగస్టు నెలతో కలుపుకుంటే ఐదునెలల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున 5 నెలలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 100 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం భరించే రాయితీతో 5 నెలలకు సుమారు రూ.4వేలు విలువైన బియ్యం కార్డుదారులకు అందుతాయి. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో లేని రేషన్ కార్డు దారులు ఈ మేరకు నష్టపోవాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ వద్ద పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు లేవని.. అందుకే కూపన్లు ఇచ్చి వాటిపై విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. కాగా పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం పూర్తి వివరాలు చెప్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!