PMGKAY Scheme: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలోని కార్డుదారులకే రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో మొత్తం 1.45 కోట్ల రేషన్ కార్డు దారులు ఉండగా వీరిలో 88.75 లక్షల మందికే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. దీంతో మిగిలిన 56.6 లక్షల మంది రేషన్ కార్డు దారులకు బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
కాగా పీఎంజీకేఏవై పథకం కింద ఏపీలో ఏప్రిల్ నుంచి బియ్యం పంపిణీ జరగడం లేదు. దీంతో ఆగస్టు నెలతో కలుపుకుంటే ఐదునెలల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున 5 నెలలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 100 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం భరించే రాయితీతో 5 నెలలకు సుమారు రూ.4వేలు విలువైన బియ్యం కార్డుదారులకు అందుతాయి. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో లేని రేషన్ కార్డు దారులు ఈ మేరకు నష్టపోవాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ వద్ద పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు లేవని.. అందుకే కూపన్లు ఇచ్చి వాటిపై విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. కాగా పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం పూర్తి వివరాలు చెప్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!