ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తరచూ సర్వర్…
ఏపీలో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిలు కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు…
గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…