Perni Nani: జేపీ నడ్డా ఏపీకి అబద్ధాలను పోగేసుకుని వచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలను పోగేసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరని పేర్ని నాని చురకలు వేశారు.
ఏపీ అప్పులపై నడ్డా చెప్పింది అంతా తప్పేనని.. 130 లక్షల కోట్లకు దేశ అప్పును తీసుకుని వెళ్లింది ఎవరంటూ ఆయన ధ్వజమెత్తారు. మసీదులను కూలదోయటం, శవాల మీద బుల్డోజర్లు పోనివ్వటం మినహా మీరు చేస్తున్నది ఏంటని మండిపడ్డారు.నడ్డా ఏపీకి వచ్చే ముందు ఆర్ధిక మంత్రిని అడిగి వివరాలు తీసుకుని వస్తే బాగుండేదంటూ నాని సెటైర్లు వేశారు. తాము పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. మోదీకి, ఆర్థిక మంత్రికి తెలియకుండా అప్పులు తీసుకున్నామా అంటూ చురకలు వేశారు. ఆయుష్మాన్ భారత్ కింద పెట్టే రూల్స్ అమలు చేస్తే ఏపీలో ఒక్కరికీ ఆరోగ్యశ్రీ రాదని ఆయన ఆరోపించారు. దేశంలో మతం పేరుతో తన్నుకునేలా విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
దేశంలో ప్రతిపక్షాలపై పువ్వు పార్టీ ఏ రకంగా ఈడీలు, సీబీఐ పేరుతో దాడులు చేస్తున్నది అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కాపీ కొట్టి ఆయుష్మాన్ భారత్ అని తీసుకుని వచ్చిన చరిత్ర బీజేపీది అంటూ ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కేంద్రం ఇచ్చింది 230 కోట్లేనని… రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెడుతున్న ఖర్చు 2,300 కోట్లు అంటూ పేర్ని నాని వివరించారు. కోటి 30 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంటే.. కేంద్రం ఇస్తున్నది 50 లక్షల కుటుంబాలకు మాత్రమేనన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏమైనా రాష్ట్రానికి బిచ్చం వేస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఒక్క మాట మాట్లాడటానికి నోరు రాలేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని అది ఏమయ్యిందంటూ ప్రశ్నించారు. విజయవాడ, తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖకు మెట్రో రైలు వంటి హామీలు ఏమయ్యాయన్నారు. మ్యానిఫెస్టోను కాలగర్భంలో కలిపేశారా అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
దేశ ప్రజలపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, స్కూళ్లల్లో నాడు- నేడు, ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. నడ్డా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఏకైక ఆప్షన్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమేనని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు… పవన్ కళ్యాణ్ కాదని పేర్ని నాని అన్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!