Janasena: కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శిరివెళ్లలో ఓ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. ఇదివరకే అన్నదాతకు అండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రైతు భరోసా యాత్ర సమయంలోనూ పవన్ పలువురు రైతులకు ఆర్థికసాయం అందించారు. 41 మంది రైతులకు రూ. 1 లక్ష చెక్లను ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కర్నూలు జిల్లా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే అని, సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ళలో బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ రైతు కుటుంబాలకి అందాల్సిన సాయం అందలేదని చెప్పిన నాదెండ్ల.. తొలి విడతలో భాగంగా 130 మంది కౌలు రైతులకు పవన్ సాయం చేయనున్నారని తెలిపారు. రెండో విడతలో మిగిలిన వారికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పవన్పై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మాని, రైతులకు సాయం అందించే పనిపై దృష్టి పెట్టమని ఆయన సూచించారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
పవన్ కళ్యాణ్ ఈ రైతు భరోసా యాత్ర చేపట్టగానే.. ఆదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం రూ.లక్ష వేస్తోందని అన్నారు. నిజానికి.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వారికి రూ. 7 లక్షల సాయం అందాలని, ఆ డబ్బులు వారికి అందజేయాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. రైతు భరోసా యాత్రం రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గ్రహించే.. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారన్నారు. రైతులకు అందాల్సిన పూర్తి సాయం అందేవరకూ.. జనసేన పోరాటం ఆగదని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.
రైతుల ఆత్మహత్యలపై రాజకీయం చేయడం మాని.. అన్నదాతలకు ఎలా అండగా నిలవాలో, వారికి ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలన్న విషయంపై ఆలోచిస్తే మేలని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారిని సూచించారు. సాగు నష్టాలు, రుణ భారంలో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని అన్నారు. ఇందుకు రైతుల ఆత్మహత్యలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడే స్థితికి వచ్చారంటే, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విషయం అర్థమవుతోందన్నారు.
8వ తేదీన కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/KEwnfs5ecq
— JanaSena Party (@JanaSenaParty) May 2, 2022
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!