Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Meets Once Again With Ap Bjp Incharge Muralidharan In Delhi

Pawan Kalyan Meets Muralidharan: ఢిల్లీలో జనసేనాని బిజీ బిజీ.. వరుస భేటీలు.. పొత్తులపై తేల్చేస్తారా..?

Published Date :April 4, 2023 , 11:34 am
By Sudhakar Ravula
Pawan Kalyan Meets Muralidharan: ఢిల్లీలో జనసేనాని బిజీ బిజీ.. వరుస భేటీలు.. పొత్తులపై తేల్చేస్తారా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Pawan Kalyan Meets Muralidharan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపున్నారు.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు.. నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్‌.. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌ మురళీధరన్ తో సమావేశమయ్యారు. గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది.. ఇక, ఈ రోజు మరోసారి మురళీధరన్‌తో సమావేశం అయ్యారు పవన్‌ కల్యాణ్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. నిన్న సమావేశం ముగిసిన తర్వాతే కాదు.. ఈ రోజు కూడా.. ఇంకా పలువురిని కలవాల్సి ఉందని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. అందరినీ కలిసిన తర్వాత వివరాలు చెబుతాన్నారు.. అయితే, ఈ భేటీల్లో పొత్తులపై కీలకంగా చర్చ సాగుతున్నట్టుగా సమాచారం.. బీజేపీ మాత్రం జనసేనతో కలిసి వెళ్లాలని ఆలోచనతో ఉండగా.. పవన్‌ కల్యాణ్ మాత్రం.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు నడుస్తూనే.. ఎన్నికల్లో విజయం సాధ్యమనే భావనలో ఉన్నారు.. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read Also: Attar shops in Hyderabad: రంజాన్ మాసం.. భారీగా వెలసిన అత్తర్ విక్రయాలు

Also Read

  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
  • RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్‌
  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
Add as a preferred
source on google

ఇక, ఈ రోజు మురళీధరన్‌తో జరిగిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తో పాటు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ పాల్గొన్నారు. దీంతో.. పొత్తులపై కీలక చర్చ జరిగిందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో నిన్న రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన పవన్‌.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ పెద్దలతో ఇంకా సమావేశాలు ఉన్నాయని జనసేనాని చెబుతున్న నేపథ్యంలో.. సాయంత్రం బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.

Read Also: CM YS Jagan: రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్‌.. పర్యటన వివరాలు ఇవే..

మొత్తంగా భవిష్యత్ కార్యాచరణపై పవన్‌ కల్యాణ్‌ సమాలోచనలు చేస్తున్నారు.. టీడీపీతో పొత్తుతో సహా అన్ని అంశాలపై క్లారిటీ కోసం మంతనాలు సాగిస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సమాలోచనలు సాగుతున్నాయి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో గంట పాటు సమావేశమైన జనసేన నేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. పోలవరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా చర్చించారు.. ఇక, ఇవాళ బీఎల్‌ సంతోష్‌తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.. జేపీ నడ్జా, అమిత్ షాలతో కూడా అవకాశాన్ని బట్టి సమావేశం కానున్నారు.. ఈ భేటీల్లో ముఖ్యంగ బీజేపీ అభిమతం, ఎన్నికలకు సమాయత్తం, రాజకీయ కార్యాచరణపై స్పష్టత కోరుతున్నారు జనసేన అధినేత.. అయితే, హస్తిన పర్యటనలో పొత్తులపై జనసేనాని ఎలాంటి వైఖరి తీసుకుంటారు.. బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • Delhi
  • janasena
  • Muralidharan

తాజావార్తలు

  • Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో

  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు

  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions