CM YS Jagan: రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్.. పర్యటన వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఐదవ రోజు మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కోదండ రాముడు.. ఇక, రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు ఒంటిమిట్ట రాముడు.. మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తుల సౌకర్యార్థం 118 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా బుధవారం ఒంటిమిట్టను సందర్శించనున్నారు.. సీఎం వైఎస్ జగన్ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చే సింది.. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్.. స్వామి వారిని దర్శించుకోనున్నారు..
Read Also: Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
ఇక, సీఎం వైఎస్ జగన్ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 5వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 2 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం.. 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ఆయన.. మళ్లీ టీటీడీ అతిథి గృహానికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు.. ఇక, సాయంత్రం 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం.. సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, సీఎం వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా.. కడప జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!