Pawan Kalyan: 12 కుటుంబాలకు రూ.60 లక్షలు అందించిన జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు అభ్యంతరం తెలపడంతో నోవాటెల్ హోటల్లోనే పవన్ కళ్యాణ్ ఈ చెక్కులు పంపిణీ చేశారు.
Read Also: ప్రపంచంలోని 10 అతిపెద్ద అడవులు
Also Read
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
మరోవైపు నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అటు తనకు సంఘీభావం తెలిపిన ప్రజా నేతలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పలు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఎటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తుందో అందరూ చూశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. ప్రభుత్వం పోలీస్ శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని చంద్రబాబు ఖండించారని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తెలిపారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా తనకు ఫోన్ చేసి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని పవన్ వివరించారు.
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!