Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Gives Clarity On AP Volunteers Issue: తనకు వాలంటీర్ వ్యవస్థపై కోపం లేదని, అయితే ఈ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోలేదని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాలంటీర్లు లేనప్పుడు కూడా రేషన్ వస్తువుల పంపిణీ సజావుగానే సాగిందని, పంపిణీ ఎక్కడా ఆగిపోలేదని అన్నారు. తల్లిసాక్షిగా.. తనకు వాలంటీర్ల పొట్ట కొట్టాలని లేదన్నారు. జనవాణిలో భాగంగా.. తనకు వాలంటీర్లపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కొందరు పేరెంట్స్ ఫిర్యాదు చేశారన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం.. రాష్ట్రంలో 29,279 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ప్రతి యాభై ఇళ్ళ గుట్టు ఒకరి చేతిలో పెడుతున్నారన్నారు.
Fake Post: కోపంతో పోయాడంటూ పోస్ట్.. చివరిచూపుకోసం బారులు తీరిన బంధువులు
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ఏలూరులోని దెందలూరు నియోజకవర్గ నాయకులు, వీరమహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఎంతోమంది వందల కోట్లిస్తాం, వ్యాపారాలు చేసుకుందామని ఆఫర్లు ఇచ్చారని.. రాజకీయాలు వద్దు అని సూచించినవాళ్లు ఉన్నారని చెప్పారు. కానీ.. తాను రాజకీయాల్లో మార్పు కోసం జనసేన స్థాపించి, పదేళ్ల నుంచి నడిపిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. కేవలం వైసీపీ విధానాలపైనే తనకు చిరాకు ఉందన్నారు. నాయకులు చేసే తప్పులు ప్రజలపై పడతాయని.. వ్యక్తులు చేసే తప్పులు కులాలపై పడతాయని వివరించారు. మనవాడైనా సరే.. అతడు సరైనవాడో కాదో చూడాలని హితవు పలికారు. జగన్ మావాడేనని దళితులు అనుకుంటే, మొదటి దెబ్బ వారికే కొట్టారని మండిపడ్డారు.
Thaman : అలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలో ధోనిని చూసి నేర్చుకున్నా..
పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నపుడు.. పర్సనల్ వివరాలు ఎందుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అరగంట కాకపోతే పది గంటలు మట్లాడుకోండని.. జగన్ పబ్జీ ఆన్లైన్ గేమ్ ఆడుకున్నా అడ్డు చెప్పమని ఎద్దేవా చేశారు. కానీ.. పబ్లిక్ డబ్బులతో గ్యాంబ్లింగ్ ఆడితే మాత్రం తోలు తీస్తామని హెచ్చరించారు. డిబేట్ని తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ వ్యక్తిగత జీవితంపై డిబేట్స్ నడిపేవారు.. 30వేల మంది ఆడపడుచులు మిస్ అయ్యారంటే ఎందుకు డిబేట్ నడిపించరు? అని ప్రశ్నించారు. దానిపై డబ్బు రాదు కాబట్టే.. ఆ విషయం గురించి మాట్లాడరని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు కోపం వస్తుందంటే.. తప్పు జరుగుతుందన్నట్టేనని అభిప్రాయపడ్డారు.
Hero Ajith: అజిత్ మోసగాడు, నా డబ్బులు తిరిగివ్వలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్కు దాడిచేసే అవకాశం ఉందా..? ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసే హక్కు ఉందా..? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. వ్యక్తిగతంగా మాట్లాడినా తాను ఎదురు చెప్పనన్నారు. డిబేట్ను పక్కదారి పట్టించడానికి వేసే ట్రాప్లో తాను పడనని అన్నారు. జగన్ ఎప్పుడూ ఫ్యాక్షనిస్ట్లతోనే గొడవ పెట్టుకున్నారని.. కానీ విప్లవకారుడితో గొడవ పెట్టుకొలేదని చెప్పుకొచ్చారు. ఓ విప్లవకారుడితో గొడవ పడితే ఎలా ఉంటుందో తాను చూపిస్తానని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!