Fake Post: కోపంతో పోయాడంటూ పోస్ట్.. చివరిచూపుకోసం బారులు తీరిన బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Post: బతికున్న మనిషి చనిపోయాడంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు చివరి చూపు కోసం ఆయన ఇంటికి బారులు తీరారు. ఇంతలో అనుకోకుండా పోయాడని అనుకున్న మనిషి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాచబొల్లారం పరిధిలోని సర్వేశన్ గుట్ట ప్రాంతానికి చెందిన గణేష్ యాదవ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్నగర్లో లంగర్హౌస్ ఉన్న గణేష్ యాదవ్కు అనిల్ యాదవ్ బంధువు. అయితే రెండు నెలల క్రితం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అనిల్ యాదవ్ గణేష్ ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 8న గణేష్ యాదవ్ తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. విషయం తెలుసుకున్న అనిల్ యాదవ్.. గణేష్ యాదవ్ చనిపోయాడని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే గణేష్ యాదవ్కు ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో అతడి ఫోన్ హ్యాక్ కావడంతో ఆయన మరణ వార్త నిజమేనని భావిస్తున్నారు. అతని భార్య షాక్తో కుప్పకూలిపోయింది. గణేష్కు నివాళులు అర్పించేందుకు బంధువులు గణేష్ ఇంటికి చేరుకున్నారు.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇంతలోనే ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గణేష్ యాదవ్ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. షాక్ నుంచి తేరుకుని గణేష్ క్షేమంగా ఉండడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ చేసినందుకు అనిల్ యాదవ్పై గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుకు సంబంధించిన వివాదంతో ఇలా తప్పుడు పోస్టు పెట్టారని అనిల్ యాదవ్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న వ్యక్తిని చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నర్మగర్భంగా చేసే చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అంటున్నారు. ఎంత కోపం వచ్చినా ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అనిల్ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదు.. సీతక్క సీఎం ఐతే తప్పేంటి..?
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!