Fake Post: కోపంతో పోయాడంటూ పోస్ట్.. చివరిచూపుకోసం బారులు తీరిన బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Post: బతికున్న మనిషి చనిపోయాడంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు చివరి చూపు కోసం ఆయన ఇంటికి బారులు తీరారు. ఇంతలో అనుకోకుండా పోయాడని అనుకున్న మనిషి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాచబొల్లారం పరిధిలోని సర్వేశన్ గుట్ట ప్రాంతానికి చెందిన గణేష్ యాదవ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్నగర్లో లంగర్హౌస్ ఉన్న గణేష్ యాదవ్కు అనిల్ యాదవ్ బంధువు. అయితే రెండు నెలల క్రితం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అనిల్ యాదవ్ గణేష్ ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 8న గణేష్ యాదవ్ తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. విషయం తెలుసుకున్న అనిల్ యాదవ్.. గణేష్ యాదవ్ చనిపోయాడని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే గణేష్ యాదవ్కు ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో అతడి ఫోన్ హ్యాక్ కావడంతో ఆయన మరణ వార్త నిజమేనని భావిస్తున్నారు. అతని భార్య షాక్తో కుప్పకూలిపోయింది. గణేష్కు నివాళులు అర్పించేందుకు బంధువులు గణేష్ ఇంటికి చేరుకున్నారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ఇంతలోనే ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గణేష్ యాదవ్ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. షాక్ నుంచి తేరుకుని గణేష్ క్షేమంగా ఉండడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ చేసినందుకు అనిల్ యాదవ్పై గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుకు సంబంధించిన వివాదంతో ఇలా తప్పుడు పోస్టు పెట్టారని అనిల్ యాదవ్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న వ్యక్తిని చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నర్మగర్భంగా చేసే చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అంటున్నారు. ఎంత కోపం వచ్చినా ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అనిల్ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదు.. సీతక్క సీఎం ఐతే తప్పేంటి..?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!