Pawan Kalyan: వైసీపీ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే బూతులు తిడతారా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల సమస్యలపై మాట్లాడిన పలువురు జనసేన వీర మహిళలను శనివారం నాడు ఆయన సత్కరించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలను జనసేన వీరమహిళలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వైసీపీ ఎమ్మెల్యే వారిని అసభ్య పదజాలంతో దూషించారని పవన్ ఆరోపించారు. జనసేన వీర మహిళలను దూషించిన వైసీపీ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పవన్ అన్నారు.
Read Also: Vishnu Vardhan Reddy: కేంద్రం నిధులను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
వరద కారణంగా బ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీరమహిళలు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మహిళలపై ఇష్టానుసారం నోరుపారేసుకోవడం హేయం అని వర్ణించారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్ వారధులు అని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. వీర మహిళల పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఇవ్వడానికి జనసేన నాయకులు వస్తే ఎందుకంత భయం అని వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అటు ప్రజాస్వామ్య దేశంలో మహిళల పాత్ర మరింత పెరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా జనసేన పార్టీ తన వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ దాష్టీకాల మీద ధైర్యంగా మహిళలు ముందుండి పోరాడాలి
Video Link: https://t.co/WIChAaydX5 pic.twitter.com/gWUx0zMPRF
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2022
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..