Occult Worship: క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తికి దేహశుద్ది.. పోలీసులు ఎంట్రీతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Occult Worship: టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. ఈజీ మనీకోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్రపూల పేరుతో హడావిడి చేస్తున్నారు. దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. మరి కొందరు క్షుద్రపూజలతో ప్రాణాలు చేసేందుకు పూనుకుంటున్నారని కొందరు వాపోతున్నారు. పొలాల్లో, గ్రామాల్లో, ఇలాంటి క్షుద్రపూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని జీవించే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది.
Read also: Amit Shah tour in Telangana: మరోసారి మోడీ టూర్ క్యాన్సిల్.. 11న అమిత్ షా పర్యటన
Also Read
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలోని ఒక వ్యక్తి అందరితో మంచిగానే ఉంటు కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు గమనించినా అంతలా పట్టించుకోలేదు. అయితే రాను రాను అంతను చేస్తున్నది క్షుద్రపూజలు అని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం చేస్తే అతన్ని వారిపై కక్షగట్టి ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డారు గ్రామస్తులు. అయితే ఇలాగే వదిలేస్తే ప్రాణాలపై ముప్పు వస్తుందని తెగించిన గ్రామస్తులు అందరూ ఏకమయ్యారు. అతను క్షుద్రపూజలు చేస్తున్న చోటుకు వెళ్లి నిలదీశాడు. అయితే అతను నేను చేస్తున్నది క్షుద్రపూజలే అని చెప్పడంతో..ఆగ్రహానికి గురైనా గ్రామస్థులు అతనిపై దాడి చేశారు. అతన్ని కట్టేసి దేహశుద్ది చేశారు. అతడు ఎందుకు క్షుద్రపూజలు చేస్తున్నారు అనేది అతన్ని విచారిస్తున్నారు. అయితే ఈఘటన అటు ఇటు వెళ్లి మీడియా ప్రతినిధులకు, పోలీసుల వరకు వెళ్లింది. అయితే మీడియా రామాపురం గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలోకి మీడియాకు అనుమతించలేదు గ్రామస్థులు. వారిని గ్రామం బయటే అడ్డుకున్నారు. అయితే పోలీసులను ఎంట్రీ అయ్యేందుకు కూడా ముందు అనుమతి లేదన్న గ్రామస్తులు చివరికి పోలీసులు వారిని నచ్చచెప్పడంతో గ్రామంలోకి అనుమతి ఇచ్చారు. చెటుకు కట్టేసి దేహశుద్ది చేసిన నిందితున్ని విచారణ చేపట్టారు. అయితే అతను గ్రామస్థుడేనా? లేక వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఇలా క్షుద్రపూజలు చేస్తున్నాడా? లేక ఎవరిపైనా అయినా టార్గెట్ చేసి ఇలా క్షుద్రపూజలకు పాల్పడ్డాడా? అనే విషయంపై అరాతీస్తున్నారు పోలీసులు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా టెక్నాలజీ పెరుగుతున్న ప్రజల్లో ఇలాంటి మూఢనమ్మకాలు పాతుకుపోవడంపై తీవ్ర ఉత్కంఠంగా మారింది.
Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..