Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs: పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. నగరాలను మత్తుపదార్థాల దందాకు కేరాఫ్ గా మార్చుకుంటోంది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా యథేచ్చగా కొనసాగుతోంది. భారత్ మత్తులో ఊగుతోందనడంలో ఆశ్చర్యం లేదు. దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి మెట్రో సిటీల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. తాజాగా ముంబాయి ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు 33.6 కోట్ల విలువ చేసే 3.36 కేజీల కొకైన్ ను DRI అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను సబ్బుల్లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు DRI అధికారులు నిందితుడిపై అనుమానంతో తన లగేజ్ బ్యాగ్ ను తనిఖీలు చేసేందుకు ప్రయాణికున్ని అడగగా.. అతను ససేమిరా అన్నాడు.
Read also: Samath Kumb: నేటి నుంచి సమతా కుంబ్ ఉత్సాలు.. 9 కుండాలతో యాగం
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
అయితే అధికారులు అతనిపై ఇంకా అనుమానం పెరగడంతో.. తన లగేజ్ బ్యాగ్ ను తీసుకుని పరిశీలించారు. అయితే అందులో సబ్బులు బయటపడ్డాయి. అతను తన దగ్గర సబ్బులు తప్పా ఇంకా ఏమీ లేదని వాదించడంతో .. DRI అధికారులు అతని మాటలను అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే సబ్బులు ఎందుకు తీసుకుపోతున్నావని అడగటంతో.. సమాధానం ఇవ్వడానికి ప్రయాణికుడు తడపబడ్డాడు. ఇథియోపియా ప్రయాణీకుడిని DRI అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు గుట్టు రట్టైంది. తను సబ్బుల్లో కొకైన్ గుట్టుగా తరలిస్తున్నట్లు చెప్పడంతో.. అధికారులు షాక్ కు గురయ్యారు. సబ్బులను తీసి పరీక్షించగా.. అందులో తెలివిగా కొకైన్ ను పెట్టి ప్యాక్ చేసినట్లు దానిని దేశవిదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపాడు నిందితుడు. 16 చిన్న సబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సబ్బుల మైనపు పొర క్రింద ఏదో దాగి ఉన్నారని గమనించారు. సభ్యుల్లో 3.36 కేజీల కొకైన్ వుందని దీని విలువ 33.6 కోట్లు వుంటుందని తెలిపారు. ఇథియోపియా చెందిన ప్రయాణికున్ని అదుపులో తీసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి DRI బృందాలు దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!