Nimmala Ramanaidu : కృష్ణా నది దిగువ ప్రాంత ప్రజలకు అత్యవసర హెచ్చరిక.!
- కృష్ణా నదిపై వరద ఉధృతి పెరుగుతోంది : మంత్రి నిమ్మల
- సాయంత్రానికి 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం
- కింది ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- బుడమేరుపై దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మంత్రి ఖండించారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం తీవ్రమవుతోంది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, కింది ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలందరినీ అప్రమత్తం చేశామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
తగు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని, కరకట్టల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. బుడమేరుకు సంబంధించి ఎలాంటి వరద ప్రమాదం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడా కూడా ప్రమాదభరితమైన వర్షపాతం లేదు. అందువల్ల, బుడమేరుకి ఒక శాతం కూడా వరద ప్రమాదం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది అలవాటుగా బుడమేరుపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు.
Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?