TDP: మహిళా కమిషన్ ఎపిసోడ్లో ట్విస్ట్.. తెరపైకి కొత్త అంశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. ఏపీ మహిళా కమిషన్ ఎపిసోడ్ వార్తల్లో నిలిచింది.. దీనికి కారణం.. పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత, ఆరోపణలు, విమర్శలు, నోటీసులు, ఆందోళనల వరకు వెళ్లింది.. తాజాగా, ఈ వ్యవహారంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. బాధితుల గోప్యత పాటించే విషయంలో వాసిరెడ్డి పద్మే నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపించారు.. మహిళా కమిషన్ వాట్సాప్ గ్రూపులో బాధితులను ఓదారుస్తున్న వాసిరెడ్డి పద్మ విజువల్స్, ఫొటోలను మీడియాకు విడుదల చేశారన్నారు బోండా ఉమ.. వాటికి సంబంధించిన మహిళా కమిషన్ వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టారు..
Read Also: Harish Rao : కేంద్రం మాటల్లో అచ్చే దిన్.. కానీ.. చేతల్లో సచ్చేదిన్..
Also Read
- CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
- Sajjala Ramakrishna Reddy : మళ్లీ మంచి రోజులు వస్తాయి.. కూటమి పాలనపై సజ్జల ఫైర్..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
వాసిరెడ్డి పద్మ లేని అధికారాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ఆరోపించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమ.. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ను ఫాలో కావాలనుకుంటే తమ వద్ద కుదరదు.. వ్యక్తిగత గోప్యత గురించి మాట్లాడే హక్కు వాసిరెడ్డి పద్మకు లేదన్నారు.. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో బాధితురాలి.. బాధిత బంధువుల ఫొటోలు.. విజువల్స్ పెట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. పది కాదు.. దానికి 90 కలుపుకుని నాపై కేసులు పెట్టినా నేను భయపడేదే లేదన్నారు.. క్వాసి జుడిషీయరీ అధికారాలున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్కు మాకు నోటీసులిచ్చే అధికారమే లేదన్నారు.. తాడేపల్లి నుంచి ఏదో రాసిచ్చారని.. వాసిరెడ్డి ఆ కాగితాన్ని చదివేశారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వస్తున్నారు కాసేపు ఆగి రావాల్సిందిగా పోలీసులు కోరినా.. వాసిరెడ్డి పద్మ వినలేదని.. చంద్రబాబు వచ్చినా సరే నేనూ వస్తానంటూ పోలీసుల సూచనలను పట్టించుకోలేదని.. ప్రచారం కోసమే వాసిరెడ్డి పద్మ పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు బోండా ఉమ.
తాజావార్తలు
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Emergency Fund: కష్టకాలంలో కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.. ఎంత పొదుపు అవసరం? ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Vaibhav Suryavanshi: ఒకరి తర్వాత ఒకరు.. 100 ఓవర్లు.. వైభవ్ కష్టాన్ని కళ్ళకు కట్టిన కోచ్!
ట్రెండింగ్
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!