Break For Nara Lokesh Padayatra: లోకేష్ రిక్వెస్ట్.. కుదరదన్న ఈసీ.. పాదయాత్రకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Break For Nara Lokesh Padayatra: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రిక్వెస్ట్ను తోసిపుచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. దీంతో.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ బయల్దేరారు నారా లోకేష్.. అయితే, అన్నమయ్య జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోన్న సమయలో.. తాను స్థానికంగా అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నందున స్థానికంగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఇచ్చిన మినహాయింపును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.. తూర్పుగోదావరి జిల్లాలో తమ అధినేత చంద్రబాబు పాదయాత్రకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు లోకేష్.. కానీ, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలంటూ లోకేష్ కు సమాధానం పంపింది ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం..
Read Also: Natu Natu Song: మన “నాటు నాటు…” పాటకు ఆస్కార్ వచ్చేసినట్టే!?
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
లోకేష్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెళ్లడించింది.. అక్కడి నుంచి వచ్చిన సమాధానం మళ్లీ కమ్యునికేట్ చేస్తామంటూ సమాధానం ఇచ్చింది ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం.. దీంతో, ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి జిల్లా వీడుతున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.. కంటేవారి పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు.. ఇక, టీడీపీ యువనేత నారా లోకేష్ చేపనట్టిన యువగళం పాదయాత్ర వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు 529.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.. 41వ రోజు అంటే ఈ రోజు 9.5 కిలోమీటర్లు నడిచారు.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.. దీంతో.. రేపు, ఎల్లుండి.. అంటే ఈ నెల 12, 13 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చారు నారా లోకేష్.. 42వరోజు పాదయాత్ర 14వ తేదీన కంటేవారిపల్లి నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!