CM Chandrababu: కృష్ణా జలాలు లేకున్నా, గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే కరువు ఉండదు..
- పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద వరం..
- ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి..
- ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు..
- రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ, ఇప్పుడు కాదు..
- రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న నీటితో జలాశయం వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈరోజు కృష్ణనదికి జల హారతులు ఇచ్చి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులోని 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరచి నీటిని కిందికి వదిలారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్లను దేవాలయంగా భావిస్తాను.. జీవితానికి సంపద ఇచ్చేది జలాశయాలు.. టీడీపీ హయాంలోనే మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం.. కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Operation Sindoor: యుద్ధంలో చైనా పాకిస్థాన్కు సహాయం చేసిందా? చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ..
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
ఇక, పోలవరం ఏపీకి పెద్దవరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి.. ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు అన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ.. ఇప్పుడు కాదు.. రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉందన్నారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. మెట్ట పంటలు వేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా.. సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పా.. అదే చేస్తున్నాను.. వేరే పార్టీకి, టీడీపీకి తేడా చూడాలి.. ఐదేళ్లలో పింఛన్ 200 నుంచి 2 వేలు చేసా.. పింఛన్ వెయ్యి పెంచడానికి గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది.. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్
అలాగే, భూగర్భ జలాలు పరిరక్షించాలి.. అప్పుడు కరువు అనే మాట ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక, 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు అందజేస్తున్నాం.. ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఏపీ ప్రజల తరపున మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను.. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఏ ప్రభుత్వం వల్ల జీవితాలు బాగు పడతాయో.. వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, తల్లికి వందనం ఇచ్చినందుకు రెండు వేళ్ళు చూపించి స్వాగతం పలికారు.. గత ఐదేళ్లు ప్రజల మొహల్లో నవ్వు మాయం అయింది.. ఇపుడు అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది అన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత అందికి తల్లికి వందనం ఇచ్చాము.. 7 మంది పిల్లలు ఉంటే లక్ష 5 వేలు ఇచ్చాం.. జనాభా పెంచాలి.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారి భారాన్ని ప్రభుత్వం పంచుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!