Operation Sindoor: యుద్ధంలో చైనా పాకిస్థాన్కు సహాయం చేసిందా? చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ..
- చైనా పాకిస్థాన్కు సైనిక మద్దతు ఇచ్చిందా?
- ఈ ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి ‘లైవ్ ల్యాబ్’గా ఉపయోగించుకుందని అన్నారు. ఈ అంశంపై సోమవారం, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ను మీడియా ప్రశ్నించింది. చైనా, పాకిస్థాన్ పొరుగు దేశాలు అని, వాటి మధ్య సాంప్రదాయ స్నేహం ఉందని మావో నింగ్ అన్నారు. రక్షణ, భద్రతా సహకారం రెండు దేశాల మధ్య సాధారణ సహకారంలో భాగమని స్పష్టం చేశారు. ఈ యుద్ధ సమయంలో చైనా పాకిస్థాన్కు సైనిక సహాయం అందించలేదని మావో నింగ్ తన సమాధానంలో ఎక్కడా ఖండించలేదు. ఈ ఆరోపణ ఎలా వచ్చిందో తనకు తెలియదని.. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. చైనా-పాక్ సంబంధాలు మూడో దేశాన్ని ప్రభావితం చేయవని తెలిపారు.
READ MORE: Anil Kumar Yadav: మారణాయుధాలతో దాడి.. ప్రసన్నకుమార్ ఇంటిపై 200 మందికి పైగా హత్యాయత్నం!
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఏం చెప్పారు?
గత వారం ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్కు చైనా, టర్కీలు మద్దతుగా నిలిచాయన్నారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్ను చైనా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసిందన్నారు. భారత్కు ఒక సరిహద్దు.. ఇద్దరు శుత్రువులు ఉన్నారన్నారు. కానీ నిజానికి ముగ్గురు శత్రువులు అని ఆయన వివరించారు. అందులో పాకిస్థాన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్కు చైనా అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందన్నారు. పాకిస్థాన్ మిలటరీ వినియోగిస్తున్న హార్డ్వేర్లో 81 శాతం చైనాకు చెందినవేనని ఈ సందర్భంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ భారత్పై పాక్ నిర్వహించిన దాడుల్లో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్కు టర్కీ సైతం అదే తరహాలో సహాయం చేసిందన్నారు. ఈ యుద్ధంలో టర్కీ పైలట్లు నేరుగా పాల్గొన్నారని వివరించారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!