Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్
- కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం
- రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం
- బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీలో చర్చకు సవాల్ విసిరిన భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : మహబూబాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మండిపడుతూ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల అప్పులు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. మనపై అవాకులు చెవాకులు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులకు నేను ఓ స్పష్టమైన సవాల్ చేస్తున్నాను.. అసెంబ్లీకి రండి, అన్ని విషయాలపై చర్చిద్దాం. ప్రెస్ క్లబ్ కాదు, ప్రజా ప్రతినిధుల సభ అయిన అసెంబ్లీనే సరైన వేదిక అని తెలిపారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కేటీఆర్ మాటలపై స్పందించిన భట్టి.. “నోరు ఉందని ఏది పడితే తట్టకుండా మాట్లాడితే ఎలా? గతంలో మీరు ఉన్నప్పుడు విద్యుత్ వినియోగం ఎంత? డిమాండ్ ఎంత? ఇవన్నీ మర్చిపోతే ఎలా? ఇప్పుడు రెండు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు” అని అన్నారు.
“నువ్వు మాట్లాడినట్టుగా మళ్లీ మాట్లాడితే ఈసారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు” అంటూ హెచ్చరించారు. అంతేకాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా ఖండించారు. “నదుల బేషన్లు కూడా తెలియవంటారా? ఇది ఎలాంటి విమర్శ?” అంటూ ప్రశ్నించారు.
“రైతులకు వాగ్దానాన్ని నెరవేర్చాం. రుణమాఫీ చేశాం. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. కానీ ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు విమర్శలకు పాల్పడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, అన్ని లెక్కలతో చర్చిద్దాం. ప్రెస్ క్లబ్లో చర్చలు కావు. ప్రజల ఎదురుగా అసెంబ్లీ వేదికపై మాట్లాడుకుందాం” అని పునరుద్ఘాటించారు.
Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్తో రీడిజైన్డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!
- Tags
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..