Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్
- కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం
- రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం
- బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీలో చర్చకు సవాల్ విసిరిన భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : మహబూబాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మండిపడుతూ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల అప్పులు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. మనపై అవాకులు చెవాకులు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులకు నేను ఓ స్పష్టమైన సవాల్ చేస్తున్నాను.. అసెంబ్లీకి రండి, అన్ని విషయాలపై చర్చిద్దాం. ప్రెస్ క్లబ్ కాదు, ప్రజా ప్రతినిధుల సభ అయిన అసెంబ్లీనే సరైన వేదిక అని తెలిపారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
కేటీఆర్ మాటలపై స్పందించిన భట్టి.. “నోరు ఉందని ఏది పడితే తట్టకుండా మాట్లాడితే ఎలా? గతంలో మీరు ఉన్నప్పుడు విద్యుత్ వినియోగం ఎంత? డిమాండ్ ఎంత? ఇవన్నీ మర్చిపోతే ఎలా? ఇప్పుడు రెండు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు” అని అన్నారు.
“నువ్వు మాట్లాడినట్టుగా మళ్లీ మాట్లాడితే ఈసారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు” అంటూ హెచ్చరించారు. అంతేకాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా ఖండించారు. “నదుల బేషన్లు కూడా తెలియవంటారా? ఇది ఎలాంటి విమర్శ?” అంటూ ప్రశ్నించారు.
“రైతులకు వాగ్దానాన్ని నెరవేర్చాం. రుణమాఫీ చేశాం. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. కానీ ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు విమర్శలకు పాల్పడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, అన్ని లెక్కలతో చర్చిద్దాం. ప్రెస్ క్లబ్లో చర్చలు కావు. ప్రజల ఎదురుగా అసెంబ్లీ వేదికపై మాట్లాడుకుందాం” అని పునరుద్ఘాటించారు.
Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్తో రీడిజైన్డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!
- Tags
తాజావార్తలు
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!