BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గూడూరు నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగ శేష రెడ్డి, గూలి నాగేశ్వర్ రెడ్డి, గూలి జయరామ రెడ్డి, పీరం హర్షవర్ధన్ రెడ్డి వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే దాసరి పెద్ద దస్తగిరి, దాసరి బాలుడు,దాసరి నడిపి దస్తగిరి, దాసరి పుల్లయ్య, నారాయణ స్వామి, దాసరి హరి, దాసరి రాజేష్, దాసరి విష్ణు వర్ధన్ వంటి 15 మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబును, బనగానపల్లె అభివృద్ధి కోసం బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని ప్రకటించారు.
Ajay Manikrao: లోక్పాల్ ఛైర్పర్సన్గా మానిక్రావ్ నియామకం
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
అనంతరం కొలిమిగుండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మరో చేరికల కార్యక్రమంలో ఎస్సీ కాలనీ దళిత నాయకులు టీడీపీలో చేరారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుల వేధింపులకు విసుగెత్తిన బుగ్గ రాముడు, జీవయ్య, ఓబులేసు, బండ్రా వాసు, పేతురు, బాలయ్య మరో 15 మంది దళిత నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన దళిత నేతలు మాట్లాడుతూ… వైసీపీలో దళితులకు ప్రాణాలకు రక్షణ లేదని అని అన్నారు. దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. బీసీ జనార్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసారని కితాబు ఇచ్చారు. దళితుల స్థలాలు కబ్జాలు చేస్తూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి గారి గెలిపించుకుంటామని దళిత నేతలు ప్రకటించారు.
Odisha: బీజేడీలో రికార్డ్ బ్రేక్.. పోటీకి 10 వేల మంది అప్లై!
ఇక కొలిమిగుండ్ల మండంలోని నాయినిపల్లి గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎర్రబోతుల వర్గానికి చెందిన కీలక నేత సైకిలెక్కేసారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సమీప బంధువు ఎర్రబోతుల నాగిరెడ్డి తన అనుచరులతో సహా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బనగానపల్లెలో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈ రెండు నెలలు పట్టుదలగా పని చేద్దామని పిలుపునిచ్చారు. మొత్తంగా కొలిమిగుండ్లలో బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ కీలక నేతలు వరుసగా సైకిలెక్కడం టీడీపీ క్యాడర్లో సరికొత్త జోష్ నెలకొల్పగా, ఎన్నికలకు ముందు కీలక నేతలు టీడీపీలోకి వలసలు వెళ్లడం వైసీపీ క్యాడర్లో నైరాశ్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికల ముందు బనగానపల్లె నియోజవర్గంలో వైసీపీకి పట్టుఉన్న కొలిమిగుండ్ల మండలంలో టీడీపీలోకి వలసలు షురూ అవుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?