Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్
- ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
- 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ప్రాథమిక సమావేశం..
- రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaratri Brahmotsavam 2025: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇక, ఈ సారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.. దేవస్థానం అన్ని విభాగాల అధికారులు విభాగాలపరంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి మొదటివారంలోగా పూర్తి చేసేలా చూడాలని.. గత సంవత్సరం కంటే 30 శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు..
Read Also: PM Modi to Visit Kuwait: నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో పర్యటన!
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ఇక, మహారాత్రి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు ఈవో.. పాదయాత్రతో వచ్చే భక్తులకు నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లను కల్పించాలని.. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్, జ్యోతిర్ముడి సమర్పణ.. శివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!