Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్
- ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
- 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ప్రాథమిక సమావేశం..
- రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో..
Shivaratri Brahmotsavam 2025: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇక, ఈ సారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.. దేవస్థానం అన్ని విభాగాల అధికారులు విభాగాలపరంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి మొదటివారంలోగా పూర్తి చేసేలా చూడాలని.. గత సంవత్సరం కంటే 30 శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు..
Read Also: PM Modi to Visit Kuwait: నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో పర్యటన!
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
ఇక, మహారాత్రి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు ఈవో.. పాదయాత్రతో వచ్చే భక్తులకు నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లను కల్పించాలని.. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్, జ్యోతిర్ముడి సమర్పణ.. శివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో