Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్
- ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
- 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ప్రాథమిక సమావేశం..
- రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaratri Brahmotsavam 2025: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇక, ఈ సారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.. దేవస్థానం అన్ని విభాగాల అధికారులు విభాగాలపరంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి మొదటివారంలోగా పూర్తి చేసేలా చూడాలని.. గత సంవత్సరం కంటే 30 శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు..
Read Also: PM Modi to Visit Kuwait: నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో పర్యటన!
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ఇక, మహారాత్రి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు ఈవో.. పాదయాత్రతో వచ్చే భక్తులకు నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లను కల్పించాలని.. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్, జ్యోతిర్ముడి సమర్పణ.. శివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!