Minister BC Janardhan Reddy: రెవెన్యూ సదస్సులో వీఆర్వోపై ఫిర్యాదు.. తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు
- నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో రెవెన్యూ సదస్సు..
- పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వీఆర్వోపై ఫిర్యాదు చేసిన మహిళ..
- వీఆర్వోను వెంటనే సస్పెండ్ చేయాలంటూ మంత్రి ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి..
Read Also: Car Sales : అమ్మకాలు క్షీణించినా.. అత్యధికా కస్టమర్లను పొందిన టాప్ 10కంపెనీలు ఇవే !
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
మహిళ ఫిర్యాదు చేయగానే వీఆర్వో గంగన్నను గ్రామసభ వేదికపైకి పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వీఆర్వో గంగన్నను సస్పెండ్ చేయాలంటూ ఇదే గ్రామ సభలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ను ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని కొందరు ఎమ్మార్వోలు, ఆర్ఐలు వీఆర్వోల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు రైతులకు సేవ చేసే సంకల్పంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇక, రైతులు తమ భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి బీసీ స్థానిక రైతులకు సూచించారు. గ్రామసభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం, రెవెన్యూకు సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకొని దురాక్రమణ పాల్పడిందని ఆరోపించారు, పేదల భూములను కబ్జాలు చేసిన వారికి శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!