Nallapareddy Prasanna Kumar Reddy: బాలయ్య టాక్ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallapareddy Prasanna Kumar Reddy: అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ను బాలయ్య ఇంటర్వ్యూ చేసిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి మానసికంగా చంద్రబాబు హత్య చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూకు బాలకృష్ణ ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నాడు అంట.. ఆనాడు 14 మంది శాసనసభ్యులు ఎన్టీ రామారావుతో ఉన్నామని.. వైస్రాయ్ హోటల్ వ్యవహారం నుంచి ఎన్టీ రామారావు చనిపోదాకా 14 మంది ఎమ్మెల్యేలం ఆయనతోనే ఉన్నామని నల్లపరెడ్డి స్పష్టం చేశారు. మిగతా వారందరూ చంద్రబాబు, రామోజీరావుకు అమ్ముడు పోయారన్నారు. చంద్రబాబు నైజం కాళ్లు పట్టుకుని లాగేయటమేనని ఆరోపించారు. ఆనాడు సీఎం కుర్చీలో ఎన్టీఆర్ ఉంటే కాళ్లు పట్టుకుని లాగేశాడన్నారు. ఎన్టీరామారావు అంటే మహానుభావుడు, ఒక భగవంతుడు అని.. ఆయనలో దేవుడిని చూశామన్నారు.
Read Also: National Games: జాతీయ క్రీడల్లో రికార్డు సృష్టించిన 10 ఏళ్ల బాలుడు
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
ఎన్టీఆర్ పసిపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. చంద్రబాబుది నీచమైన మనస్తత్వం అని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబులో నరనరాన విషమే ఉంటుందన్నారు. నమ్మి ఆడబిడ్డనిస్తే మామ గొంతు కోశాడన్నారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎన్టీరామారావును దించే దాంట్లో బాలకృష్ణ కూడా ఉన్నాడన్నారు. అల్లుళ్లు.. కొడుకులు ఒక్కటై ఎన్టీఆర్ ద్రోహం చేశారన్నారు. వాళ్లు ఈరోజు ఎన్టీ రామారావు భజన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తండ్రి ఇచ్చింది రెండు ఎకరాలు మాత్రమేనని.. ఈరోజు నాలుగు లక్షల కోట్లకు చంద్రబాబు అధిపతి అయ్యాడని.. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నల్లపరెడ్డి ప్రశ్నించారు. వియ్యంకుడి షోలో కూర్చుని అబద్దాలు చెప్పినంత మాత్రాన తెలుగు ప్రజలు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోరన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు మూసుకోవాల్సిందేనని.. ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!