Nakka Anandbabu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nakka Anandababu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం
టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఇరు పార్టీల నేతలు ఎక్కడో చోట విమర్శలు చేసుకుంటూనే వున్నారు. దళిత వర్గాలపై జగన్ పార్టీది కపట ప్రేమ అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడింది.. అది దొంగ సస్పెన్షన్. గడప గడపకు కార్యక్రమంలో అనంతబాబు ఫోటోకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేయటం దొంగ సస్పెన్షన్ కాక మరేంటి..?
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
అనంతబాబు సస్పెన్షనులో చిత్తశుద్ధి ఉంటే అనంతబాబు ఫోటోలు ఊరేగించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య నేపథ్యంలో వచ్చిన ఉద్యమన్ని పక్క దారి పాటించడం కోసమే కోనసీమ, అమలాపురం అల్లర్లు. ఎమ్మెల్సీ అనంతబాబును హత్య కేసు నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కుటుంబసభ్యులు, ప్రతిపక్షం ఆందోళనతో కేసు పెట్టక తప్పలేదు.
అంబేద్కరును అల్లర్లలోకి లాగటం సిగ్గుచేటు. దళిత ఓటు బ్యాంక్ వైసీపీకి దూరమవుతున్నందుకే కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. పచ్చగా కళకళలాడే కోనసీమను తగల బడటానికి సీఎం జగనే కారణం అని ఆనందబాబు మండిపడ్డారు. సీఎం కార్యాలయం ఒక పథకం ప్రకారం ఆడిన కుట్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. కుట్రలోకి దళిత వర్గాలకు ఆరాధ్యుడైన అంబేద్కర్ను లాగడం శోచనీయం. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టే విధానంలో అక్కడ కుల ఘర్షణలను ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారన్నారు.
కోనసీమ అల్లర్లకు ప్రధాన కారణం మంత్రులు, ఎమ్మెల్యేలేనని స్పష్టంగా తెలుస్తున్నా ప్రతిపక్షాల మీదకు నెట్టడానికి సీఎం జగనుకు సిగ్గు లేదా..? సాక్షాత్తూ మంత్రి విశ్వరూపే మా పార్టీ కౌన్సిలర్ హస్తం ఉందని చెప్పిన విషయం మర్చిపోయారా..? మంత్రి చెప్పిన విషయాన్ని సాక్ష్యంగా పోలీసులు తీసుకుంటారా..? కోనసీమ అల్లర్లకు వైసీపీ నేతలను పోలీసులు నిందితులుగా ప్రకటిస్తే.. సీఎం మాత్రం కోనసీమ అల్లర్లపై ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారని ఆనందబాబు విమర్శించారు.
YSRCP: కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు.. గార్గేపురంలో ఉద్రిక్తత
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!