Nagababu: వైసీపీ, ఆర్జీవీపై ఓ రేంజ్లో ఫైర్ అయిన నాగబాబు.. మీ తాత, అయ్యా ఇచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu:ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ)పై ఓ రేంట్లో ఫైర్ అయ్యారు మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్లో అడుగుతున్నానన్నారు.. కానీ, అలా అనను.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ అవసరమా..? అని ప్రశ్నించారు. మీ లాగా లక్షలాది, కోట్లాది రూపాయలు మావద్ద లేవు.. మాకున్న కొద్ది పాటి డబ్బుని, రిసోర్స్ ను అందరికీ పంచుతున్నామని వెల్లడించారు.. ప్యాకేజీ అంటూ బావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ తాత, అయ్యా మాకు ప్యాకేజీ ఇచ్చారా? అని నిలదీశారు.. మేం అన్ని కులాలను గౌరవిస్తాం.. మాకు కుల పిచ్చి లేదని స్పష్టం చేశారు నాగబాబు.
Also Read
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
ఇక, రేపటి యువశక్తి సభ ఎక్స్ లెంట్గా ఉంటుంది అన్నారు నాగబాబు.. భయం లేకుండా యువత మాట్లాడేవిధంగా ప్లాట్ పాం ఏర్పాటు చేశాం.. యువత ఆలోచనలు, కోరికలు, రాష్ర్ట అభివృద్ధికి ఇచ్చే సూచనలు తీసుకుంటాం అన్నారు.. యువతను దిశా నిర్దేశం చేయటానికి మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. రేపు పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. మరోవైపు రాంగోపాల్వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.. రాంగోపాల్ వర్మ పెద్ద వెదవ.. సన్నాసి.. నీచ్ కమీన్ కుత్తె.. అలాంటి వారి గురించి నేను మాట్లాడబోను అన్నారు.. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని ఫైర్ అయ్యారు.. నేను కాపు కులంలో పుట్టాను.. కాపు కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తాను.. కానీ, కులపిచ్చి లేదన్నారు.. ఒక కులం గురించి మాట్లాడడం తప్పు అని హితవుపలికిన ఆయన.. కాపులకు ఆత్మాభిమానం లేదా..? అని ప్రశ్నించారు.. అసలు ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుంది.. అందరికీ ఆత్మాభిమానం ఉంటుందిగా? అన్నారు. ఎన్టీఆర్ని, చంద్రబాబుని, వైఎస్ రాజశేఖర్రెడ్డిని, మళ్లీ చంద్రబాబును.. ఇప్పుడు సోకాల్డ్ అడ్డగాడిదలను కూడా గెలిపించింది కాపులే అని తెలిపారు.. అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకు ఎక్కడుందని నిలదీశారు నాగబాబు.
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!