Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Fires On Chandrababu Naidu Over Dalit Attacks: చంద్రబాబుకు దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అని, సీఎంగా ఉన్నప్పుడూ ఏనాడైనా దళితుల్ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. దళితులపై దాడులు జరిగితే ఖండించేది, చర్యలు తీసుకునేది ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును అమలు చేస్తే.. మొదటి కేసు చంద్రబాబుపైనే పెట్టాలని చెప్పారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా..? అని తమను అవమానించాడని గుర్తు చేశారు.
Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని మేరుగు నాగార్జున ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు బూటు కాలితో తన్నితే.. చంద్రబాబు ఎందుకు కేసు పెట్టలేదు? జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేస్తే.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగ వ్యక్తిని, ఆవు చర్మాన్ని కోస్తున్నాడని చెట్టుకు కట్టేస్తే.. అప్పుడు అతడ్ని ఆదుకున్నది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడన్నారు. ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను.. చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మేరుగు నాగార్జున ఆరోపణలు చేశారు. దళితులు రాజశేఖరరెడ్డి కుటుంబం వెంట ఉన్నారని చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. బహుశా తమ ప్రభుత్వంలోనూ ఎక్కడో ఒక చోట దాడులు జరిగి ఉండొచ్చని.. కానీ తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని అన్నారు. వాటిని ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదని అడిగారు.
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!