Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Fires On Chandrababu Naidu Over Dalit Attacks: చంద్రబాబుకు దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అని, సీఎంగా ఉన్నప్పుడూ ఏనాడైనా దళితుల్ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. దళితులపై దాడులు జరిగితే ఖండించేది, చర్యలు తీసుకునేది ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును అమలు చేస్తే.. మొదటి కేసు చంద్రబాబుపైనే పెట్టాలని చెప్పారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా..? అని తమను అవమానించాడని గుర్తు చేశారు.
Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని మేరుగు నాగార్జున ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు బూటు కాలితో తన్నితే.. చంద్రబాబు ఎందుకు కేసు పెట్టలేదు? జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేస్తే.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగ వ్యక్తిని, ఆవు చర్మాన్ని కోస్తున్నాడని చెట్టుకు కట్టేస్తే.. అప్పుడు అతడ్ని ఆదుకున్నది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడన్నారు. ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను.. చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మేరుగు నాగార్జున ఆరోపణలు చేశారు. దళితులు రాజశేఖరరెడ్డి కుటుంబం వెంట ఉన్నారని చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. బహుశా తమ ప్రభుత్వంలోనూ ఎక్కడో ఒక చోట దాడులు జరిగి ఉండొచ్చని.. కానీ తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని అన్నారు. వాటిని ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదని అడిగారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!