Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Fires On Chandrababu Naidu Over Dalit Attacks: చంద్రబాబుకు దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అని, సీఎంగా ఉన్నప్పుడూ ఏనాడైనా దళితుల్ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. దళితులపై దాడులు జరిగితే ఖండించేది, చర్యలు తీసుకునేది ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును అమలు చేస్తే.. మొదటి కేసు చంద్రబాబుపైనే పెట్టాలని చెప్పారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా..? అని తమను అవమానించాడని గుర్తు చేశారు.
Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని మేరుగు నాగార్జున ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు బూటు కాలితో తన్నితే.. చంద్రబాబు ఎందుకు కేసు పెట్టలేదు? జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేస్తే.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగ వ్యక్తిని, ఆవు చర్మాన్ని కోస్తున్నాడని చెట్టుకు కట్టేస్తే.. అప్పుడు అతడ్ని ఆదుకున్నది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడన్నారు. ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను.. చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మేరుగు నాగార్జున ఆరోపణలు చేశారు. దళితులు రాజశేఖరరెడ్డి కుటుంబం వెంట ఉన్నారని చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. బహుశా తమ ప్రభుత్వంలోనూ ఎక్కడో ఒక చోట దాడులు జరిగి ఉండొచ్చని.. కానీ తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని అన్నారు. వాటిని ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదని అడిగారు.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!