MP Margani Bharath: వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharath Says TDP Mahanadu Program Failed In Rajahmundry: ప్రజామన్ననలు పొందుతున్న వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. వైసీపీ శ్రేణులు గురువారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ మాట్లాడుతూ.. సీఎం జగన్ నాలుగేళ్ళ పాలన దిగ్విజయంగా పూర్తయిందని, అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పేదల పాలిట పెన్నిధిగా, పెద్ద దిక్కుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారని చెప్పారు.
Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తోందని, ప్రజలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మార్గాని భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లుగా సమర్థవంతమైన పాలన అందించి, ‘జయహో జగనన్నా’ అని ప్రతిఒక్కరి నుంచి అనిపించుకుంటున్న ఏకైకా సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. రాజమండ్రి నగరాన్ని నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామని, మరెంతగానో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి.. తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి.. కుర్చీని, పార్టీని చివరికి బ్యాంకు అకౌంట్లు కూడా లాక్కుని మానసికంగా, శారీరకంగా హింసించి వేధించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ మా దేవుడంటూ విగ్రహాలకు దండలు, శతజయంతులు నిర్వహించి.. ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారని విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు అంటే అదొక పెద్ద పండుగగా అందరూ భావించే వారని, కానీ చంద్రబాబు నిర్వహించే మహానాడు ఒక రాజకీయ స్వార్థం, వసూళ్ళ కోసం అన్నట్టుగా మారిందని మార్గాని భరత్ దుయ్యబట్టారు. మొన్న జరిగిన మహానాడుకు రాజమండ్రి నుండి కనీసం పదివేల మంది కూడా హాజరు కాలేదంటే.. ఆ పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. తమని, తమ పార్టీని మనస్ఫూర్తిగా అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు.. ప్రజల వద్దకు ర్యాలీగా బయల్దేరి వెళుతున్నామని, వారితో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!