Toll Plaza Rules Change: హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll Plaza Rules Change: వాహనం, టోల్ గేట్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈరోజుల్లో లాంగ్ డ్రైవ్ కు వెళితే ఎక్కడో ఒకచోట టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. హైవేపై డ్రైవింగ్ చేసే వారికి ఈ వార్త పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. కోట్లాది మంది వాహన యజమానులను ప్రభావితం చేసే టోల్ ట్యాక్స్కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. 2024 సంవత్సరానికి ముందు భారతదేశంలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని, అదే సమయంలో టోల్ ట్యాక్స్కు కొత్త నిబంధనలు జారీ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. టెక్నాలజీలో కూడా మార్పు వస్తుంది, గ్రీన్ ఎక్స్ప్రెస్వే నిర్మించిన తర్వాత, రోడ్ల పరంగా భారతదేశం అమెరికాతో సమానంగా ఉంటుంది. దీనితో పాటు టోల్ టాక్స్ వసూలు చేయడానికి నియమాలు, సాంకేతికతలో పెద్ద మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
Read Also:Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
టోల్ టాక్స్ రికవరీ కోసం ప్రభుత్వం రెండు పద్ధతులు
రాబోయే రోజుల్లో టోల్ రికవరీ కోసం ప్రభుత్వం 2 ఎంపికలను ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో కార్లలో ‘GPS’ వ్యవస్థలను అమర్చడం మొదటి ఎంపిక అయితే రెండో పద్ధతి తాజా నంబర్ ప్లేట్కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదు. రాబోయే రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై కూడా దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Read Also:Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవల్ గా శరత్ చంద్రారెడ్డి
డబ్బు నేరుగా ఖాతా నుంచి తీసివేయబడుతుంది
ఇప్పటి వరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, అయితే టోల్కు సంబంధించి బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి తీసివేయబడుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. దీంతోపాటు కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘2019లో కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రావాలని నిబంధన పెట్టాం. అందుకే గత నాలుగేళ్లలో వచ్చిన వాహనాలకు వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..