MP Avinash Reddy: సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎంపీ అవినాష్రెడ్డి.. నిన్న ఇచ్చి ఇవాళ రమ్మంటే ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. అయితే, సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించారు ఎంపీ అవినాష్రెడ్డి.. నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.. ఇక, ఐదు రోజులపాటు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వెల్లడించారు.. చక్రాయపేట మండలం గండి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్ రెడ్డి.. అక్కడే శాశ్వత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ నోటీసులపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించారు.
Read Also: NTR: ఈరోజు సాయంత్రం ఏం జరిగినా మేము చూసిన బెస్ట్ యాక్టర్ మాత్రం నువ్వే…
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
అయితే, ఐదు రోజులపాటు సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారని తెలిపారు ఎంపీ అవినాష్రెడ్డి… మరోసారి సీబీఐ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ నోటీసు తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇదే సందర్భంలోనే రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో తన పై, తన కుటుంబం పై ఓ వర్గం అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు అవినాష్ రెడ్డి.. తనపై వచ్చిన అభియోగాలపై తాను చాలా బాధపడ్డాను అన్నారు. ఇలాంటి విషయాల పైన ఓ నిర్ణయానికి రావడం ఎవరికైనా మంచిది కాదని హితవు పలికారు. ఈ కేసులో న్యాయం గెలవాలి.. నిజం నిర్భయంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను తెలిపారు. నేనేంటో.. నా వ్యవహరి శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు విషయంలో మీడియా సమయనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!