MP Avinash Reddy: సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎంపీ అవినాష్రెడ్డి.. నిన్న ఇచ్చి ఇవాళ రమ్మంటే ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. అయితే, సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించారు ఎంపీ అవినాష్రెడ్డి.. నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.. ఇక, ఐదు రోజులపాటు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వెల్లడించారు.. చక్రాయపేట మండలం గండి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్ రెడ్డి.. అక్కడే శాశ్వత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ నోటీసులపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించారు.
Read Also: NTR: ఈరోజు సాయంత్రం ఏం జరిగినా మేము చూసిన బెస్ట్ యాక్టర్ మాత్రం నువ్వే…
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
అయితే, ఐదు రోజులపాటు సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారని తెలిపారు ఎంపీ అవినాష్రెడ్డి… మరోసారి సీబీఐ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ నోటీసు తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇదే సందర్భంలోనే రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో తన పై, తన కుటుంబం పై ఓ వర్గం అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు అవినాష్ రెడ్డి.. తనపై వచ్చిన అభియోగాలపై తాను చాలా బాధపడ్డాను అన్నారు. ఇలాంటి విషయాల పైన ఓ నిర్ణయానికి రావడం ఎవరికైనా మంచిది కాదని హితవు పలికారు. ఈ కేసులో న్యాయం గెలవాలి.. నిజం నిర్భయంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను తెలిపారు. నేనేంటో.. నా వ్యవహరి శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు విషయంలో మీడియా సమయనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!