పీఆర్సీ అంశంపై మంత్రుల కమిటీ భేటీ .. చర్చలు ఫలించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న ఆశాభావం వ్యక్తం చేశారాయన.
ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ ఆర్ ఏ అంశాలతో పాటు చాలా అంశాలు మాట్లాడామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ మరోమారు చర్చలు జరిపి అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తాం. ఉద్యోగులతో మళ్ళీ కలిసి పని చేయాలన్నదే మా ఆకాంక్ష అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పీఆర్సీని 5 ఏళ్లకు తగ్గించే అంశాన్ని అంగీకారాన్ని తెలిపాం. ఐఆర్ రికవరీ చేయకూడదని అడిగారు అంగీకరించాం
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అంశాలపై పూర్తి స్ధాయి కమిటీతో చర్చించామన్నారు పీఆర్సీ సాధన సమితి నేత కె.ఆర్.సూర్యనారాయణ, కొన్ని అంశాల్లో ఆర్ధిక శాఖ అధికారులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ, మధ్యాహ్నం మళ్ళీ ఉద్యోగ సంఘాల తో చర్చ ఉంటుంది. చర్చలు జరిగినా ఇంకా పూర్తి ఫలితం రాని కారణంగా మా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మంత్రుల కమిటీ తో చర్చలు సానుకూలంగానే జరిగాయన్నారు.
చర్చలు జరిగినా ఇంకా చాలా అంశాల్లో స్పష్ఠత రావాల్సి ఉందన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాస్ రావు. ఇవాళ, రేపు మా ఆందోళన కొనసాగుతుంది. చర్చలు సానుకూలంగానే జరిగాయని చెప్పగలం అన్నారు స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు, కె.వెంకట్రామిరెడ్డి. చర్చలు సానుకూలంగానే జరిగాయి. నిన్న ఛలో విజయవాడలో ఉద్యోగుల ఆకాంక్షలు, ఆవేదన చర్చల్లో స్పష్టంగా కనిపించింది. కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో అంశాలపై దేనిపైనా స్పష్టత రాకపోవడంతోనే మా ఆందోళన యధావిధిగా కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!