Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం
Minister Venugopala Krishna Fires On Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ పూటకో వేషం వేస్తున్నాడని.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని మంత్రి వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. పవన్ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడాడా? అని ప్రశ్నించారు. శనివారం మంత్రి వేణు మాట్లాడుతూ.. తన వారాహి యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన ఆరోపణల్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. పవన్ స్థిరత్వం లేని వ్యక్తి అని.. ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని చెప్పే పవన్, ఇస్తే మాత్రం ఆ పదవిని తీసుకుంటానని అంటున్నాడని పేర్కొన్నారు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు అంటూ సూచించారు. తప్పులు ఉంటే చెప్పాలి కానీ చెప్పులు చూపిండం ఏమాత్రం సరికాదన్నారు.
Mint Leaves Benfits: పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు తప్పక తీసుకోవాలి!
Also Read
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
జనసేన కార్యకర్తలపై పవన్ బండరాయి వేస్తున్నాడని మంత్రి వేణు పేర్కొన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ పవన్ మాట్లాడలేడని దుయ్యబట్టారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్.. పవన్కి లభించిందని ఎద్దేవా చేశారు. పవన్.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా? అని నిలదీశారు. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావంటూ.. పరోక్షంగా చంద్రబాబుపై కౌంటర్ వేశారు. పవన్ సినిమాల్లో హీరో కావచ్చేమో గానీ.. రాజకీయాల్లో మాత్రం జీరో అని ప్రజలకు అర్థమైందని చురకలంటించారు. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నావ్ పవన్? అని అడిగారు. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందని.. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోరంటూ సెటైర్లు వేశారు.
Seediri Appalaraju: పవన్ కళ్యాణ్పై మంత్రి సీదిరి సెటైర్లు.. సీఎం పదవి ముష్టి అడిగితే వచ్చేది కాదు
గతంలోనూ పవన్ కళ్యాణ్పై మంత్రి వేణుగోపాల్ హాట్ కామెంట్లు చేశారు. పవన్ ఓ అపరిపక్వ నాయకుడని, కేవలం స్పెషల్ ప్యాకేజీల కోసమే పవన్ పొత్తులు పెట్టుకుంటాడని ఆరోపించారు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్లు చల్లాడని, తనని నమ్మిన వాళ్లను పవన్ దగా చేశాడంటూ మండిపడ్డారు. పవన్ చేసిన పని కారణంగా.. 2014-19లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆ మధ్యకాలంలో జరిగిన తప్పుల్లో పవన్ కూడా వాటాదారుడని చెప్పారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడని.. ఏ లక్ష్యాలతో జనసైనికులు పవన్కి మద్దతు ఇచ్చారో, అది తాను చేయలేనని చెప్పేశాడంటూ మంత్రి వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో