Minister Roja: లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టం.. బీఆర్ఎస్ వాటికి సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు మరో 11 మంది బలయ్యారని రోజా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి 40 మందిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడంలేదని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్కు కనిపించడం లేదా అని.. పవన్ తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అంటూ నిలదీశారు.
Read Also: CPI Raja: ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి.. దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయి
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
అటు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని మంత్రి రోజా అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 11 మంది చనిపోయారని.. లోకేష్ పాదయాత్ర చేస్తే టీడీపీకే నష్టం అని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర పట్ల టీడీపీ నేతలే భయపడుతున్నారని చురకలు అంటించారు. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపైనా మంత్రి రోజా స్పందించారు. ఎక్కడైనా, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని.. పోటీ చేయవచ్చని తెలిపారు. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏపీకి తీరని నష్టం చేశారని.. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినా దానిని చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదని.. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!