Minister Roja: పవన్ కళ్యాణ్కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja Fires On Pawan Kalyan Over AP Volunteer Issue: ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. వాలంటీర్లేమో రోబోలు గానీ, బయటి వ్యక్తులు గానీ కాదని.. మీ ప్రాంతానికి చెందిన మీలో ఒకరికే వాలంటీర్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్దే నిర్ణయం
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని, ప్రేమించుకొని పారిపోతున్నారని, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వాలంటీర్లను కేవలం ఇదొక్కటే చేయమని తామేమీ ఒత్తిడి చేయడం లేదని.. వాలంటీర్ పనులు చేస్తూనే చదువుకోవచ్చని, ఇతర ఉద్యోగాలకు అప్లై చేయొచ్చని మంత్రి రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన పిచ్చి వ్యాఖ్యల్ని నమ్మకుండా.. ఇలాంటివన్నీ గమనించాలని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు అన్నీ అందుతుండటం చూసి సహించలేకే.. ప్రతిపక్షాలు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ వాలంటీర్లకు పైస్థాయి ఉద్యోగాలు వస్తే, అందుకు ప్రభుత్వం అండగా కూడా ఉంటుందని హామీ ఇచ్చారు.
Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం
ఇక చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనేమీ చేయలేదని రోజా ధ్వజమెత్తారు. అప్పట్లో రాష్ట్రాన్ని విడగొట్టారని, ఏపీ సీఎంగా అయ్యాక అభివృద్ధివైపుకు రాష్ట్రాన్ని నడిపించలేదని, కనీసం ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని తూర్పారపట్టారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అటు మామను, ఇటు ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఇకపై ఏపీ ప్రజలు ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీల్ని సీఎం అయ్యాక నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి జగనన్న అని కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు.. ఈసారి ఛాన్స్ ఇస్తే చేస్తామంటే, ఎంతవరకు నమ్మాలో మీరు ఆలోచించుకోండని ప్రజల్ని సూచించారు.
తాజావార్తలు
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!