Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్దే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thota Trimurthulu Interesting Comments On Ramachandrapuram Seat Issue: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మిథున్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీలో ఎవరికెన్ని అభిప్రాయాలైనా ఉండొచ్చని, కానీ సీటు విషయంలో అంతిమ నిర్ణయం అధిష్తానందేనని తేల్చి చెప్పారు. వేణు వ్యవహారశైలితో కేడర్ ఇబ్బంది పడుతోందని ధ్వజమెత్తారు. అదే విషయం తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళానని, త్వరలో సీఎం జగన్ని కలిసి పార్టీలో పరిస్థితులను వివరిస్తానని అన్నారు. తాను, బోస్ ఆరుసార్లు ఎన్నికల్లో తలపడ్డామని గుర్తు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలో చెప్పాల్సింది వ్యక్తులు కాదు, హైకమాండ్ అని చెప్పారు. కేడర్ ఇబ్బందులు పడుతుంటే.. తాను గానీ, బోస్ గానీ చూస్తూ ఉరుకోలేమని పేర్కొన్నారు. రామచంద్రపురంలో జనసేన, టీడీపీలకు ఎలాంటి బలం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.
Dimple Hayathi: ఎద అందాలను ఎరగా వేసి.. కుర్రాళ్లను చంపేస్తున్న డింపుల్
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
అంతకుముందు మిథున్ రెడ్డితో జరిగిన సమావేశంలో భాగంగా.. తోట త్రిమూర్తులు ఆయన దృష్టికి కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని చెప్పారు. ఇంతకుముందు తాను, పిల్లి సుభాష్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నామని.. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు.
Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!