Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్దే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thota Trimurthulu Interesting Comments On Ramachandrapuram Seat Issue: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మిథున్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీలో ఎవరికెన్ని అభిప్రాయాలైనా ఉండొచ్చని, కానీ సీటు విషయంలో అంతిమ నిర్ణయం అధిష్తానందేనని తేల్చి చెప్పారు. వేణు వ్యవహారశైలితో కేడర్ ఇబ్బంది పడుతోందని ధ్వజమెత్తారు. అదే విషయం తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళానని, త్వరలో సీఎం జగన్ని కలిసి పార్టీలో పరిస్థితులను వివరిస్తానని అన్నారు. తాను, బోస్ ఆరుసార్లు ఎన్నికల్లో తలపడ్డామని గుర్తు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలో చెప్పాల్సింది వ్యక్తులు కాదు, హైకమాండ్ అని చెప్పారు. కేడర్ ఇబ్బందులు పడుతుంటే.. తాను గానీ, బోస్ గానీ చూస్తూ ఉరుకోలేమని పేర్కొన్నారు. రామచంద్రపురంలో జనసేన, టీడీపీలకు ఎలాంటి బలం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.
Dimple Hayathi: ఎద అందాలను ఎరగా వేసి.. కుర్రాళ్లను చంపేస్తున్న డింపుల్
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అంతకుముందు మిథున్ రెడ్డితో జరిగిన సమావేశంలో భాగంగా.. తోట త్రిమూర్తులు ఆయన దృష్టికి కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని చెప్పారు. ఇంతకుముందు తాను, పిల్లి సుభాష్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నామని.. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు.
Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!